ETV Bharat / bharat

Bengal Accident Today : వ్యాన్​లో పువ్వులు లోడింగ్​.. ఢీకొన్న లారీ.. ఆరుగురు కూలీలు మృతి

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2023, 11:54 AM IST

Updated : Oct 28, 2023, 1:05 PM IST

Bengal Accident Today
Bengal Accident Today

Bengal Accident Today : పికప్​ వ్యాన్​లో పువ్వులు లోడ్​ చేస్తున్న సమయంలో.. సిమెంట్​ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వల్ల ఆరుగురు కార్మికులు మృతి చెందారు. బంగాల్​లో జరిగిందీ ప్రమాదం.

Bengal Accident Today : బంగాల్​లోని ఖరగ్​పుర్​ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఆరుగురు కూలీలు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పికప్​ వ్యాన్​లో పువ్వులు లోడ్​ చేస్తుండగా సిమెంట్​ లారీ ఢీకొట్టడం వల్ల ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పశ్చిమ మేదినీపుర్​ జిల్లా.. ఖరగ్​పుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బురమలా వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను రక్షించి తదుపరి చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మిడ్నాపుర్ ఆస్పత్రికి తరలించారు.

"శనివారం ఉదయం కార్మికులు.. పికప్​ వ్యాన్​లో పూలు లోడింగ్​ చేస్తున్నారు. ఆ సమయంలో 10-12 మంది కార్మికులు.. పువ్వులు లోడ్​ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అకస్మాత్తుగా సిమెంట్​ లారీ వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఒకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించారు" అని పోలీసులు తెలిపారు.

మరో ప్రమాదంలో..
కొన్నిరోజుల క్రితం.. తమిళనాడులో ప్రభుత్వ బస్సును టాటా సుమో ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయనిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం మరో ఇద్దరు చనిపోయారు. ఘటనలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. టాటా సుమోలో ప్రయానిస్తున్న వారు అన్నామలైయార్ దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. తిరువణ్ణామలైలో జిల్లాలో ఈ ఘటన జరిగింది. టాటా సుమో తిరువణ్ణామలై నుంచి బెంగళూరు వస్తుంది. ధర్మపురి నుంచి తిరువణ్ణామలై వైపుగా బస్సు వెళ్తోంది. ఈ రెండు వాహనాలు అంతనూర్ వద్ద ఢీకొన్నాయి. టాటా సుమోలో ప్రయాణిస్తున్న వారిలో కొంత మంది స్వస్థలం అసోం అని.. వృత్తిరీత్యా బెంగళూరులో పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు. టాటా సుమోలో మొత్తం 11 మంది ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు.

"ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నాం. హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టాం. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించాం. ఓ వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే చనిపోయాడు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఐదుగురు ఘటనాస్థలిలోనే చనిపోయారు." అని పోలీసులు తెలిపారు.

Chennai Train Accident Today : రైల్వే ట్రాక్​పై ఆటలు.. ట్రైన్ ఢీకొని ముగ్గురు దివ్యాంగ చిన్నారులు మృతి

Karnataka Accident Today :​ లారీని ఢీకొన్న టాటా సుమో.. 13 మంది ఏపీ వాసులు మృతి

Last Updated :Oct 28, 2023, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.