ETV Bharat / bharat

'కొవిడ్​పై పోరులో బంగాల్​కు అండగా కేంద్రం'​

author img

By

Published : May 8, 2021, 5:24 AM IST

కరోనా మహమ్మారిని ఎదుర్కోవటంలో బంగాల్​కు తాము అండగా ఉంటామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ, ఆ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వైరస్​ పాజిటివిటీ రేటు 40 శాతానికిపైగా ఉందని తెలిపింది. ఈ క్రమంలో.. పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచటం సహా.. ఆరోగ్య మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

harsha vardhan
'కొవిడ్​పై పోరులో బంగాల్​కు అండగా కేంద్రం'​

దేశమంతటా సార్వత్రిక టీకా​ విధానాన్ని తీసుకురావాలని బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరుతున్న తరుణంలో.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ స్పందించారు. కొవిడ్​పై పోరులో బంగాల్​కు కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కానీ, ఆ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో పాజిటివిటీ రేటు 40 శాతానికి పైగా ఉందని పేర్కొన్నారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను పెంచటంపై దృష్టి సారించాలని మమతకు సూచించారు. ఈ మేరకు ఆయన నాలుగు పేజీల లేఖను రాశారు.

"కరోనాపై పోరులో ప్రతి రాష్ట్రానికి కేంద్రం మద్దతునందిస్తోంది. అది కేవలం ఆర్థికపరంగానే కాదు. అవసరమైన వైద్య పరికరాలు, డయోగ్నస్టిక్స్​, ఔషధాలు సహా ఇతర అత్యవసరమైన సామగ్రిని అందిస్తోంది. బంగాల్​లోని కొన్ని జిల్లాల్లో పాజిటివిటీ రేటు 40 శాతానికిపైగా ఉంది. అక్కడ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. అదే విధంగా.. రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది."

-హర్షవర్ధన్​, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

ఇటీవల.. బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, వరుసగా ముడోసారి అధికారాన్ని చేపట్టిన మమతా బెనర్జీకి హర్షవర్ధన్​ తన లేఖలో అభినందనలు తెలిపారు. ప్రస్తుత కరోనా టీకా విధానాన్ని రద్దు చేయాలని.. దేశమంతటా ఒకే ధరతో సార్వత్రిక కవరేజీని తీసుకురావాలని కోరుతూ సుప్రీంకోర్టును బంగాల్​ ప్రభుత్వం ఆశ్రయించిన రోజే కేంద్రం ఈ లేఖను రాయటం గమనార్హం.

అంతకుముందు.. బంగాల్​కు మెడికల్ ఆక్సిజన్ సరఫరాను పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీకి.. సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్​ సరఫరాను పెంచారని.. కానీ తమ రాష్ట్రానికి సరిపడినంత పెంచలేదని ఆరోపించారు.

ఇదీ చూడండి: '24 గంటలు కాలేదు.. అప్పుడే రాష్ట్రపతి పాలనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.