ETV Bharat / bharat

అసోంలో 2 లక్షల మందిపై వరద ప్రభావం.. అరుణాచల్ ప్రదేశ్​​లో ఐదుగురు మృతి

author img

By

Published : May 17, 2022, 6:50 AM IST

Assam Floods: అసోంను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా ఇప్పటికే సుమారు 2లక్షల మంది నిరాశ్రయులైనట్లు అసోం ప్రభుత్వం ప్రకటించింది. కొండచరియలు విరిగిపడి రహదారులు దెబ్బతిన్నాయి.

Assam Floods
Assam Floods

అసోంలో 2 లక్షల మందిపై వరద ప్రభావం.. అరుణాచల్ ప్రదేశ్​​లో ఐదుగురు మృతి

Assam Floods: భారీ వర్షాలు, వరదలతో... అసోం అతలాకుతలమౌతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో 20 జిల్లాలు జల దిగ్భందంలో చిక్కున్నాయి. కొండచరియలు విరిగిపడటం వల్ల దిమా హసావో జిల్లాలో రాకపోకలు నిలిచిపోయి సంబంధాలను కోల్పోయింది. అంతకుముందు ముగ్గురు మరణించగా.. తాజాగా మరో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,97,248 మంది వరద ప్రభావితులు ఉండగా.. హొజాయ్​ జిల్లాలో 78,157 మంది, కచ్చార్​ జిల్లాలో 51,357 మంది నిరాశ్రయులయ్యారు. ఈ మేరకు అసోం విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

అసోం వ్యాప్తంగా 652 గ్రామాలు, 46 రెవెన్యూ సర్కిళ్లు వరద గుప్పెట్లో చిక్కుకున్నట్లు అసోం ప్రభుత్వం ప్రకటించింది.20 జిల్లాల్లో సమారు 2 లక్షల మంది వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. ఏడు జిల్లాలో 55 వరద సహాయ కేంద్రాలను ప్రారంభించగా.. 32,959 మంది ఆశ్రయం పొందుతున్నట్లు తెలిపింది. ప్రభావిత జిల్లాలో మరో 12 సహాయ కేంద్రాలు తెరుస్తామని పేర్కొంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.

వరదల్లో చిక్కుకున్న 2,800 ప్రయాణికలను సురక్షిత ప్రాంతాలకు చేరవేసినట్లు ఈశాన్య ఫ్రాంటియర్​ రైల్వే తెలిపింది. ట్రాక్​లు ధ్వంసం కావడం వల్ల సుమారు 18 రైళ్లను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు అరుణాచల్​ప్రదేశ్​లో వరదల కారణంగా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురు క్షతగాత్రులయ్యారు. బాధితులకు ఎక్స్​గ్రేషియా ప్రకటిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండు తెలిపారు.

ఇదీ చదవండి: నీట మునిగిన ఇళ్లలో ఉండలేక.. వలస వెళ్లే దారిలేక.. పాపం అసోంవాసులు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.