ETV Bharat / bharat

పోలీసులా? వైఎస్సార్​సీపీ కార్యకర్తలా? - అధికార పార్టీకి దాసోహమైన ఖాకీలు

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 4, 2024, 7:31 AM IST

AP Police System Providing Services to YSRCP Leaders: వైఎస్సార్​సీపీ నాయకుడైతే చాలు హత్య కేసు నిందితుడైనా న్యాయమూర్తులపై దూషణ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్నా వారికి సలాం చేస్తున్నారు. పోలీసు అధికారులమని మరచి వైఎస్సార్​సీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా నియోజకవర్గాల్లో వైఎస్సార్​సీపీ నాయకులను డీఎస్పీలు, ఇన్​స్పెక్టర్లు, ఎస్సైలు కలిసి పుష్పగుచ్ఛాలు, కానుకలు అందించి శుభాకాంక్షలు చెప్పేందుకు క్యూ కట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ap_police.
ap_police.

పోలీసులా వైసీపీ కార్యకర్తలా - అధికార పార్టీకి దాసోహమైన ఖాకీ

AP Police System Providing Services to YSRCP Leaders: అధికారులు ప్రజాప్రతినిధుల్ని కలవటం మామూలే. కానీ అందుకు భిన్నంగా వైఎస్సార్​సీపీ పాలనలో ఇన్​ఛార్జ్​లు సైతం అధికారులపై పెత్తనం చేస్తున్నారు. దళిత యువకుడిని హత్య చేసి, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు నిందితుడు. పేరుకు వై ఎస్సార్​సీపీ నుంచి సస్పెండైనా రంపచోడవరం నియోజకవర్గంలో పార్టీకి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. నూతన సంవత్సర సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని సీఐలు, ఎస్సైలు ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు క్యూ కట్టారు. అందరూ కలిసి బృందంగా వెళ్లి పుష్పగుచ్చాలు అందించారు.

న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించి, అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైఎస్సార్​సీపీ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్‌పై అభియోగాలున్నాయి. ఆయన్ను గతంలో సీబీఐ విచారించింది. అలాంటి వ్యక్తికి అభినందనలు, శుభాకాంక్షలు చెప్పడానికి పర్చూరు నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులు పోటీపడ్డారు. ఆయనతో కేకు కట్‌ చేయించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరుడు వీరంగం - పట్టించుకోని పోలీసులు

Guntur District: ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్​సీపీ ఇన్​ఛార్జ్​లు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అధికారులు సైతం వారిని కలసి తరించిపోతున్నారు. మంగళగిరి ఇన్​ఛార్జ్​గా నియమితులైన గంజి చిరంజీవిని నూతన సంవత్సరం సందర్భంగా మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులంతా కలిశారు. కొత్త ఏడాది వేడుకల్లో గంజి చిరంజీవితో కలిసి పాల్గొన్నారు. పత్తిపాడు ఇన్​ఛార్జ్​ బాలసాని కిరణ్ కుమార్ అయితే ఏకంగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రైతులకు శనగ విత్తనాల పంపిణీలో పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గంలోని అధికారులు, పోలీసులు ఆయనతో కలిసి కొత్త ఏడాది సందర్భంగా కేక్ కట్ చేశారు.

'మిషన్ ఫ్లాప్' సాఫ్ట్​వేర్ ఇంజినీర్​పై సెబ్ పోలీసుల దాడి - తీవ్రంగా గాయపడడంతో పరార్

Bapatla District: బాపట్ల జిల్లా పర్చూరు ఇన్​ఛార్జ్​ని నియోజకవర్గంలోని పోలీసు అధికారులంతా మూకుమ్మడిగా కలిసి కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో కలిసి కేక్ కట్ చేయటంతో పాటు తినిపించి తరించిపోయారు. వేమూరు వైఎస్సార్​సీపీ ఇన్​ఛార్జ్​ వరికూటి అశోక్ బాబు పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. అధికారులు లేదా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ జరగాల్సి ఉండగా... అశోక్ బాబు తన చేతుల మీదుగా కొత్త పెన్షన్లను అందజేశారు. అద్దంకి ఇన్​ఛార్జ్​గా కొత్తగా నియమితులైన పాణెం హనిమిరెడ్డిని పోలీసు అధికారులు కలిశారు.

ఆర్మీ జవాన్​పై పోలీసుల అరాచకం - నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా మూకుమ్మడి దాడి

Palnadu District: పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఇన్​ఛార్జ్​ మల్లెల రాజేష్ నాయుడుతో సైతం అధికారులు తరచుగా కలుస్తున్నారు. నియోజకవర్గంలోని అధికారులతో ఆయన సమావేశాలు నిర్వహిస్తూ వారికి ఆదేశాలు ఇస్తున్నారు. రేపల్లె ఇన్​ఛార్జ్​ ఈపూరి గణేష్ సైతం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారిక కార్యక్రమాల్లో పార్టీ నేతలు పాల్గొనటం విమర్శలకు తావిస్తోంది. రానున్న ఎన్నికల్లో రాజకీయ లబ్దికోసం వైఎస్సార్​సీపీ ఇన్​ఛార్జ్​లు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీటిని నియంత్రించాల్సిన అధికారులు సైతం అందులో పాలుపంచుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.