ETV Bharat / bharat

రాంగ్ సిగ్నల్.. లూప్​లైన్​లోకి రైల్.. బాలేశ్వర్​లో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

author img

By

Published : Jul 18, 2023, 6:59 PM IST

Updated : Jul 18, 2023, 7:26 PM IST

train accident odisha
train accident odisha

290 మంది ప్రాణాలను బలిగొన్న ఒడిశా బాలేశ్వర్​లో మరో రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది. సిగ్నలింగ్​లో లోపం వల్ల మరమ్మతులు జరుగుతున్న లూప్​ లైన్​లోకి ప్రవేశించింది రైలు. లోకోపైలట్​ అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పింది.

ఒడిశా బాలేశ్వర్​లో త్రుటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. సిగ్నలింగ్​లో లోపం వల్ల మరమ్మతులు జరుగుతున్న లూప్​ లైన్​లోకి ప్రవేశించింది రైలు. లోకోపైలట్​ అప్రమత్తతతో వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. లూప్​లైన్​ పనులు జరుగుతున్న విషయాన్ని గమనించిన లోకోపైలట్​.. వెంటనే బ్రేకులు వేశాడు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి పనులు జరుగుతున్న లైన్​లోకి సిగ్నల్ ఇవ్వడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న సాంకేతిక సిబ్బంది.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిగ్నలింగ్​లో తలెత్తిన లోపాన్ని సరిదిద్ది.. రైలు రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనతో భద్రక్ నుంచి బాలేశ్వర్​ లైనులో రైళ్ల రాకపోకలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. మరమ్మతు చేస్తున్న లైనులోకి అలానే వెళ్లుంటే.. ఘోర ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు వాపోయారు.

"ట్రాక్​లో ఏదో సమస్య ఉందని లోకోపైలట్​ గమనించారు. వెంటనే బ్రేకులు వేయడం వల్ల రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ తర్వాత 300 మీటర్లు రైలును వెనక్కి పోనిచ్చారు. దీంతో ప్రయాణికులంతా భయపడి రైలు దిగారు."

--ప్రయాణికుడు

290 మందికి పైగా మృతి
అంతకుముందు ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలోనే మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 290 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1200 మందికిపైగా గాయపడ్డారు. సిగ్నలింగ్​ లోపం వల్ల లూప్‌లైన్‌లో నిలిపి ఉంచిన గూడ్సు రైలును కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. అదే సమయంలో అటువైపు వెళ్తున్న హావ్‌డా-యశ్వంత్‌పూర్‌ రైలు కూడా కోరమండల్ ఎక్స్​ప్రెస్​ బోగీలను ఢీ కొట్టడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగిపోయింది. సిగ్నలింగ్‌ వ్యవస్థలో లోపమే ఈ ఘోరానికి కారణమై ఉంటుందని రైల్వేశాఖ ప్రాథమికంగా నిర్థరించింది. దీనిపై సీబీఐ దర్యాప్తునకు కూడా ఆదేశించింది.

మరోవైపు ఈ కేసు విచారణలో భాగంగా బాలేశ్వర్​ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (సిగ్నల్) అరుణ్ కుమార్ మొహంతా, సెక్షన్ ఇంజనీర్ మహ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్​ను సీబీఐ అరెస్ట్​ చేసింది. హత్య, ఆధారాల ధ్వంసానికి సంబంధించిన పలు సెక్షన్ల కింద వీరిని అరెస్ట్ చేసింది. వీరంతా బాలేశ్వర్​ జిల్లాలో విధులు నిర్వర్తించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి : ఒకే ట్రాక్​పై ప్యాసింజర్​, గూడ్స్​.. తప్పిన పెను ప్రమాదం!.. రైల్వేశాఖ క్లారిటీ

చెన్నై-బెంగళూరు ఎక్స్​ప్రెస్​లో పొగలు.. ప్రయాణికులు హడల్.. 12 నిమిషాల్లోనే..

Last Updated :Jul 18, 2023, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.