ETV Bharat / bharat

ఆ ఒక్కరినీ నియమిస్తే 25 హైకోర్టులకు సీజేలున్నట్లే..

author img

By

Published : Jan 3, 2021, 10:21 PM IST

All but one of 25 high courts now have regular chief justice
ఆ ఒక్కరినీ నియమిస్తే.. అన్ని కోర్టులకూ సీజేఐలున్నట్టే!

సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు దేశంలోని నాలుగు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం పూర్తయింది. దీంతో మొత్తం 25 ఉన్నత న్యాయస్థానాలకు గాను.. 24కోర్టులకు శాశ్వత న్యాయమూర్తులు ఉన్నట్లైంది. గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియ కూడా ఈవారంతంలో పూర్తికానుంది.

దేశంలోని మొత్తం 25 ఉన్నత న్యాయస్థానాలకు గాను 24 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం పూర్తైంది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు మరో న్యాయమూర్తి నియామకం జరగాల్సి ఉంది. ఇక సుప్రీంకోర్టులో ఉన్న నాలుగు ఖాళీలను భర్తీ చేసేందుకు న్యాయశాఖకు కొలీజియం సిఫార్సు చేయాల్సి ఉంది.

గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉత్తరాఖండ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధాన్షు ధులియాకు కొలీజియం పదోన్నతి కల్పించగా.. ఆ ఫైలు ఒక్కటి పెండింగులో ఉంది. ఈ వారంతంలో అధికారిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది. పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.మురళీధర్​కు ఒడిషా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదోన్నతి దక్కింది. దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించిన జస్టిస్​ హిమా కోహ్లీ.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్​ పంకజ్ మిత్తల్ జమ్ముకశ్మీర్-లద్దాఖ్ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకమయ్యారు. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సంజీబ్ బెనర్జీ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

మొత్తం ఐదుగురు న్యాయమూర్తులకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ ఇటీవలే సిఫారసు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. ఇప్పటికే నలుగురి నియామకం పూర్తి కాగా.. గువాహటి హైకోర్టు సీజే నియామక ప్రక్రియ కూడా ఈ వారం పూర్తి అవుతుంది.

సుప్రీంలో నాలుగు ఖాళీలు..

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకం కోసం న్యాయ మంత్రిత్వ శాఖకు కొలీజియం సిఫార్సులు చేయనుంది. 2019లో జస్టిస్ రంజన్​ గొగోయి​ పదవీ విరమణతో ఓ ఖాళీ ఏర్పడగా.. జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అరుణ్ మిశ్రాల పదవీ విరమణతో మొత్తం నాలుగు ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం 34 మంది న్యాయమూర్తులకు గాను.. 30 మంది న్యాయమూర్తులతోనే సుప్రీంకోర్టు విధులు నిర్వహిస్తోంది.

ఈ అంశంపై స్పందించిన ప్రభుత్వం న్యాయమూర్తుల నియామకం అనేది కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల మధ్య జరిగే నిరంతర ప్రక్రియని పేర్కొంది. దీనికి రాజ్యాంగ నిపుణుల సంప్రదింపులతో పాటు ఆమోదం అవసరమని తెలిపింది.

ఇదీ చదవండి: 'ట్రిపుల్​ తలాఖ్​ కేసుల్లో ముందస్తు బెయిల్​ జారీ చేయొచ్చు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.