ETV Bharat / bharat

కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై బర్త్​ సర్టిఫికెట్​తో పాటు ఆధార్​

author img

By

Published : Oct 15, 2022, 8:33 PM IST

Aadhaar
ఆధార్

ఆధార్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అప్పుడే పుట్టిన పిల్లల జనన ధ్రువీకరణ పత్రంతో పాటు ఆధార్ ఇవ్వాలని నిర్ణయించింది.

అప్పుడే పుట్టిన పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్‌ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణతోపాటు మరో 15 రాష్ట్రాల్లో ప్రస్తుతం.. ఈ విధానం అమలు చేస్తుండగా త్వరలోనే అన్ని రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు వెల్లడించింది. తెలంగాణలో గతేడాది నుంచే జనన ధ్రువీకరణ పత్రాన్ని ఆధార్‌తో అనుసంధానం చేశారు.

తాజాగా అన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్‌) చర్యలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం ఐదేళ్లలోపు చిన్నారులకు.. ఆధార్‌ ఇచ్చినప్పటికీ వారి వేలిముద్రలు, ఐరిస్‌ నమోదు చేయకుండా పిల్లల ఫొటోను తల్లిదండ్రుల ఆధార్‌తో అనుసంధానిస్తున్నారు. తర్వాత 5 నుంచి 15 ఏళ్ల మధ్య బయోమెట్రిక్‌ను అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఆధార్‌ ఆధారంగా.. కేంద్ర, రాష్ట్రాల్లోని దాదాపు వెయ్యి పథకాల్లో లబ్ధిదారులను నిర్ణయిస్తున్నారు. ఇప్పటివరకూ 134 కోట్ల ఆధార్‌ కార్డులను జారీ చేసినట్లు ఉడాయ్‌ వెల్లడించింది.

ఇవీ చదవండి: కర్ణాటకలో పరువు హత్య.. గోనె సంచిలో యువకుడి మృతదేహం.. యువతిని సైతం..

పండగల వేళ బాంబుదాడులు.. హరిద్వార్, రిషికేశ్​లకు 'జైషే మహ్మద్' బెదిరింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.