ETV Bharat / bharat

జీఎస్​టీ జాయింట్​ కమిషనర్​ అదృశ్యం​.. ఏం జరిగింది?

author img

By

Published : Jan 6, 2022, 11:26 AM IST

GST official missing: ఇటీవల పలువురు వ్యాపారుల ఇళ్లలో జీఎస్​టీ అధికారుల సోదాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ క్రమంలో ముంబయిలో జీఎస్​టీ జాయింట్​ కమిషనర్​ అదృశ్యం కలకలం సృష్టించింది. ఇంతకీ ఏం జరిగింది?

GST official missing
జీఎస్​టీ జాయింట్​ కమిషనర్​ అదృశ్యం​

GST official missing: ఉత్తర్​ప్రదేశ్​ సహా పలు రాష్ట్రాల్లో రాజకీయ, వ్యాపార వర్గాల్లోని ప్రముఖుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఆదాయపన్ను శాఖ, జీఎస్టీ అధికారులు. కోట్ల రూపాయలు పట్టుకున్న ఉదంతాలు వెలుగు చూస్తున్న తరుణంలో.. మహారాష్ట్ర, ముంబయిలో వస్తు సేవల పన్ను-జీఎస్​టీ జాయింట్​ కమిషనర్​ కనిపించకుండా పోవటం కలకలం రేపింది. జీఎస్​టీ అధికారి అదృశ్యం సంచలనంగా మారింది. ఎవరైనా కిడ్నాప్​ చేసి ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ జరిగింది..

ముంబయిలోని మజ్​గావ్​ ప్రాంతంలో ఉన్న జీఎస్​టీ కార్యాలయం నుంచి మధ్యాహ్న భోజన సమయంలో బయటకు వెళ్లారు జాయింట్​ కమిషనర్​(55). సాయంత్రం అవుతున్నా తిరిగిరాలేదు. దీంతో ఆయన సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యం​ కేసు నమోదు చేశారు పోలీసులు.

ఆఫీస్​ నుంచి బయటకు వెళ్లిన సమయంలో జాయింట్​ కమిషనర్​ తన వెంట ఫోన్ కూడా​ తీసుకెళ్లలేదని పోలీసులు తెలిపారు.

ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. అపహరణ జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: మహిళా హక్కుల కార్యకర్త బిందు అమ్మినిపై దాడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.