పక్షి దెబ్బకు విమానంలో మంటలు​.. టేకాఫ్​ అయిన వెంటనే ప్రమాదం.. లక్కీగా...

author img

By

Published : Jun 19, 2022, 1:11 PM IST

Updated : Jun 19, 2022, 2:36 PM IST

flight
flight ()

పట్నా నుంచి దిల్లీకి వెళ్లాల్సిన స్పైట్​జెట్​ విమానంలో మంటలు చెలరేగాయి. అయితే మంటలను గుర్తించి వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్​ చేయగా.. ఎటువంటి నష్టం జరగలేదు. ఇంజిన్​ను పక్షి ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్పైస్​జెట్​ ప్రతినిధులు తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపడతామన్నారు అధికారులు.

విమానంలో మంటలు

ఓ పక్షి 185 మంది ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. అప్పుడే టేకాఫ్​ అయిన స్పైస్​జెట్​ విమానంలో మంటలు చెలరేగేలా చేసింది. విమానం ఎడమవైపు ఉన్న ఓ ఇంజిన్​ను పక్షి ఢీకొనడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా ఇంజిన్​ నుంచి మంటలు రావడం చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదాన్ని గుర్తించిన పైలట్లు​ విమానాన్ని తిరిగి పట్నా ఎయిర్​పోర్ట్​లో ల్యాండ్​ చేశారు.

అయితే ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదు. సిబ్బంది.. ప్రయాణికులను సురక్షితంగా విమానం నుంచి బయటకు తీసుకువచ్చారు. అనంతరం వీరిని మరో విమానంలో దిల్లీకి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన స్పైస్​జెట్​ ప్రతినిధులు.. పక్షి ఢీకొనడం వల్ల విమానం ఎడమవైపు ఉన్న ఆ ఇంజిన్​ భాగం బాగా దెబ్బతిందని, మూడు బ్లేడ్లు ధ్వంసమైనట్లు తమ ప్రాధమిక పరిశీలనలో తేలిందన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : అగ్నిపథ్​ రిక్రూట్​మెంట్​.. వాయుసేన కీలక ప్రకటన!

Last Updated :Jun 19, 2022, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.