ETV Bharat / bharat

Vaccination In India: దేశంలో 80 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ

author img

By

Published : Sep 18, 2021, 5:58 PM IST

vaccine
టీకా డోసులు

దేశంలో టీకా డోసుల(Vaccination In India) పంపిణీ క్రమంగా పుంజుకుంటోంది. శనివారం నాటికి దేశవ్యాప్తంగా 80 కోట్ల టీకా డోసుల పంపిణీ(Covid News India) చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ తెలిపారు.

దేశంలో టీకా డోసుల(Vaccination In India) పంపిణీ 80 కోట్లకు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్ మాండవీయ తెలిపారు. కొవిడ్​ కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్(Vaccination in India till today)​ ప్రక్రియలో ఈ మార్క్​ను అందుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.

"కొవిడ్​ను ధైర్యంగా ఎదుర్కొంటున్నాం. భారత్​లో 80 కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగింది. ఈ మార్క్​ను అందుకోవడం ఆనందంగా ఉంది."

---మన్​సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.

శుక్రవారం వ్యాక్సినేషన్​ ప్రక్రియ రికార్డు స్థాయిలో కొనసాగింది. దేశవాప్తంగా ఒకేరోజు 2. 5 కోట్ల టీకా డోసుల(Vaccination News India) పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా దేశానికి అభినందనలు తెలిపిన మాండవీయ 'వరల్డ్స్‌ లార్జెస్ట్ వ్యాక్సినేషన్ డ్రైవ్' అనే పేరుతో ట్వీట్ చేశారు.

దేశంలో వ్యాక్సిన్​ పంపిణీ సంఖ్య 10 కోట్లు (covid vaccine) చేరడానికి 85 రోజులు పట్టింది. ఆ తర్వాత క్రమంగా టీకా పంపిణీ పుంజుకుంది. అక్కడి నుంచి వ్యాక్సినేషన్​ సంఖ్య.. 45 రోజుల్లో 20 కోట్లకు, 20 రోజుల్లో 50 కోట్లకు, 19 రోజుల్లో 60 కోట్లకు, 13 రోజుల్లో 70 కోట్లకు చేరింది. ఇప్పుడు ఐదు రోజుల వ్యవధిలోనే 80 కోట్ల మార్కును చేరింది.

ఇదీ చదవండి:'వ్యాక్సినేషన్​లో ప్రపంచ రికార్డ్​.. టీకా పంపిణీ@2.5కోట్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.