ETV Bharat / bharat

ఏడేళ్ల బాలికపై మైనర్లు సామూహిక అత్యాచారం.. తీవ్రంగా హింసించి..

author img

By

Published : Jul 6, 2022, 11:02 PM IST

Gang rape in odisha: ఏడేళ్ల బాలికపై ఆరుగురు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని కేంద్రపడ జిల్లాలో జరిగింది.

gang rape in odisha
gang rape in odisha

Gang rape in odisha: ఒడిశా కేంద్రపడలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై ఆరుగురు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి.. అంగుల్​లోని​ జువైనల్​ అబ్జర్వేషన్​ హోమ్​కు తరలించారు.

సదర్ పోలీస్ స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలిక పాఠళాలకు వెళ్లి వస్తోంది. ఈ క్రమంలోనే బాలికను గమనించిన ఆరుగురు నిందితులు.. బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి ఎత్తుకెళ్లారు. అనంతరం ఆమెను కొట్టి అత్యాచారం చేశారు. ఈ విషయం బయటపెడితే చంపేస్తామంటూ బెదిరించారు. ఇంటికి వచ్చిన బాలిక తన తల్లికి చెప్పడం వల్ల ఆమె పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

ఇదీ చదవండి: స్పైస్​జెట్​కు షోకాజ్​ నోటీసులు! మరో విమానంలోనూ సాంకేతిక సమస్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.