ETV Bharat / bharat

'మహా'లో కరోనా విలయం- ఆ రాష్ట్రాల్లో ఆంక్షలు

author img

By

Published : Apr 20, 2021, 9:55 PM IST

Updated : Apr 20, 2021, 10:13 PM IST

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మహారాష్ట్రలో కొత్తగా 62,097 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. వైరస్​ ధాటికి మరో 519 మంది మరణించారు. ఉత్తర్​ప్రదేశ్​లో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 29,754 మంది కరోనా బారిన పడగా.. 167 మంది వైరస్​కు బలయ్యారు. దిల్లీలోనూ రికార్డు స్థాయిలో 28,395 మంది వైరస్​ బారిన పడ్డారు. కేరళలో 19,577 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా.. పలు రాష్ట్రాలు కరోనా కట్టడికి ఆంక్షల బాట పడుతున్నాయి.

latest corona cases in india
కరోనా సునామీ

దేశంలో కొవిడ్ విజృంభణ అంతకంతకూ పెరుగుతోంది. మహారాష్ట్రలో ఒక్కరోజే కొత్తగా 62, 097 కరోనా కేసులు వెలుగుచూశాయి. వైరస్​తో మరో 519 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 39 లక్షల 60 వేల 359కు చేరింది. ఒక్క ముంబయిలోనే 7,214మందికి కరోనా నిర్ధరణ అయింది.

మిగతా రాష్ట్రాల్లో ఇలా..

  • ఉత్తర్​ప్రదేశ్​లో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 29,754 మంది కరోనా బారిన పడ్డారు. మరణాలు సైతం ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయిలో ఒక్కరోజే 167 మంది వైరస్​కు బలయ్యారు.
  • దిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా మరో 28,395 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ ధాటికి 277 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • కేరళలో రికార్డు స్థాయిలో కొత్తగా 19,577 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్​ ప్రభావానికి మరో 28 మంది మరణించారు.
  • రాజస్థాన్​లో కొత్తగా 12, 201 మంది వైరస్​ బారిన పడ్డారు. కొవిడ్​ కారణంగా మరో 64 మంది మరణించారు.
  • తమిళనాడులో కొత్తగా 10,986 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. కొవిడ్​ ధాటికి మరో 48 మంది మరణించారు.
  • ఉత్తరాఖండ్​లో కొత్తగా 3,012 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. వైరస్​తో మరో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • హిమాచల్ ప్రదేశ్​లో కొత్తగా 1,340 మందికి కరోనా సోకింది. మహమ్మారి కారణంగా మరో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆంక్షల బాట..

మరోవైపు, కరోనా కట్టడికి రాష్ట్రాలు లాక్​డౌన్​ను ఆశ్రయిస్తున్నాయి. ఇప్పటికే దిల్లీలో లాక్​డౌన్ కొనసాగుతుండగా.. ఛత్తీస్​గఢ్​లో బుధవారం ఒక్కరోజు లాక్​డౌన్ విధించనున్నారు. ఒక్కరోజు పాటు లాక్​డౌన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

కర్ణాటకలో ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు రాత్రి కర్ఫ్యూను అమలులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

కేరళ ఎర్నాకులం జిల్లాలోని అన్ని కంటైన్​మెంట్ జోన్లలో లాక్​డౌన్​ విధిస్తూ స్థానిక కలెక్టర్ ఎస్ సుహాస్ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం రాత్రి 6 గంటల నుంచి ఏడు రోజుల పాటు ఈ లాక్​డౌన్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : లాక్​డౌన్​పై ప్రధాని మోదీ కీలక ప్రకటన

Last Updated : Apr 20, 2021, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.