ETV Bharat / bharat

'84 దేశాలకు 64 మిలియన్ల టీకా డోసులు'

author img

By

Published : Mar 31, 2021, 5:34 AM IST

ఇప్పటివరకు 84 దేశాలకు 64 మిలియన్ల కరోనా టీకా డోసులను సరఫరా చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ తెలిపారు. భారత్​లో 61 మిలియన్ల టీకా డోసులు అందించినట్లు చెప్పారు. ప్రపంచ దేశాలతో విజ్ఞాన శాస్త్ర లాభాలను పంచుకునేందుకు భారత్​ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు.

harsha vardhan
'84 దేశాలకు 64 మిలియన్ల టీకా డోసులు'

భారత్​లో 61 మిలియన్​ కరోనా టీకా డోసులను పంపిణీ చేయగా.. 84 దేశాలకు 64 మిలియన్ల టీకాను సరఫరా చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఆసియావ్యాప్తంగా వ్యాక్సిన్​ ఉత్పత్తి, సరఫరాపై నిర్వహించిన 'వరల్డ్​ ఇమ్యూనైజేషన్​ అండ్​ లాజిస్టిక్స్'​ సదస్సులో మంగళవారం.. ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్నారు. భారత్​లో వ్యాక్సిన్​ ఉత్పత్తి, అంతర్జాతీయ భాగస్వాములకు టీకా సరఫరా చేసే అంశాల గురించి​ వివరించారు.

"61 మిలియన్లకు పైగా టీకా డోసులను భారత్​లో పంపిణీ చేశాం. 84 దేశాలకు 64 మిలియన్ల డోసులను అందించాం. విజ్ఞాన శాస్త్ర లాభాలు ప్రపంచమంతటికీ చేరాలని మేము ఎల్లప్పుడూ భావిస్తాం."

-హర్షవర్ధన్​, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

ఈ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన 1,000 పైకి పైగా మందిన ప్రతినిధులు హాజరయ్యారు. భారత్​లో వినియోగిస్తున్న కొవిషీల్డ్​, కొవాగ్జిన్​ టీకాల గురించి ఈ సదస్సులో హర్షవర్ధన్ వివరించారు. భారత్​లో మరో 6 టీకాలు.. క్లినికల్​ ట్రయల్స్​ దశలో ఉన్నట్లు తెలిపారు. అన్నిదేశాలకు టీకా సమానంగా పంపిణీ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన 'హోప్​' వేదిక సహాయపడుతుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'కరోనా పరిస్థితి తీవ్రం- 10 జిల్లాల్లోనే అధిక కేసులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.