చాక్లెట్​ తిని ఆరేళ్ల బాలిక మృతి.. ఏం జరిగిందంటే?

author img

By

Published : Jul 20, 2022, 10:44 PM IST

6-year-old girl chokes to death while eating chocolate in K'taka

స్కూల్​కు వెళ్లనని మారాం చేసిన ఓ ఆరేళ్ల చిన్నారి.. అమ్మ కొనిచ్చిన చాక్లెట్​ను ఆనందంగా తింటోంది. ఈ లోపల స్కూల్​ బస్​ వచ్చిందనే హడావుడిలో ఒక్కసారిగా చాక్లెట్​ను మింగేసింది. ఆ తర్వాత బస్​ ఎక్కుతుండగా డోర్​ వద్దే కుప్పకూలింది. ఈ విషాద ఘటన కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో జరిగింది.

కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో విషాద ఘటన జరిగింది. స్కూల్​ బస్ వచ్చిందనే హడావుడిలో చాక్లెట్​ మింగేసిన ఓ చిన్నారి.. బస్​ డోర్​ వద్దే కుప్పకూలింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. అప్పటికే చిన్నారి మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదీ జరిగింది.. జిల్లాలోని బైందూర్​ సమీపంలో ఉన్న బిజూర్​ గ్రామానికి చెందిన సమన్వి(6) అనే బాలిక.. స్థానిక వివేకానంద స్కూల్​లో మొదటి తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం.. చిన్నారి స్కూల్​కు వెళ్లడానికి మారాం చేసింది. అయితే తల్లిదండ్రులు.. బాలికను నచ్చజెప్పి చాక్లెట్​ ఇచ్చారు. అనంతరం చాక్లెట్​ను బాలిక తింటున్న సమయంలో స్కూల్​ బస్​ వచ్చేసింది. దీంతో ఆ హడావుడిలో సమన్వి.. ఒక్కసారిగా చాక్లెట్​ను మింగేసింది. ఆ తర్వాత స్కూల్​ బస్​ డోర్​ వద్ద కుప్పకూలింది.

6-year-old girl chokes to death while eating chocolate in K'taka
మృతి చెందిన చిన్నారి సమన్వి

వెంటనే గమనించిన తల్లిదండ్రులు.. హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నివేదిక వచ్చాకే మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు. బుధవారం పాఠశాలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది.

ఇవీ చదవండి: ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన 13 భవనాలు.. అధికారుల వార్నింగ్​!

మైనర్​ బాలికపై అత్యాచారం.. నిందితుడికి 46 ఏళ్ల జైలు శిక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.