ETV Bharat / bharat

పడవ మునక- ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి

author img

By

Published : Dec 2, 2020, 7:18 PM IST

5 members of the same family died after a boat capsizes in Tiller Dam of Agar Malwa
పడవ మునక: ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి

మధ్యప్రదేశ్​లో జరిగిన పడవ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని అధికారులు తెలిపారు. మరణించినవారిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

మధ్యప్రదేశ్​ అగర్ మాల్వా ప్రాంతంలోని తిల్లర్ డ్యామ్ వద్ద జరిగిన పడవ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు.

సమీపంలోని ఓ గ్రామంలో జరిగిన కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో పడవ తలకిందులైందని అధికారులు తెలిపారు. ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు నీటిలో మునిగిపోయినట్లు చెప్పారు. పడవలో ప్రయాణిస్తున్న మిగితావారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.