ETV Bharat / bharat

దేశంలో మరో 45,209 కరోనా కేసులు

author img

By

Published : Nov 22, 2020, 9:38 AM IST

భారత్​లో తాజాగా 45,209 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 91 లక్షలకు చేరువైంది. మరో 501 మంది మరణించారు.

45,209 Covid-19 cases and 501 deaths reported in India
దేశంలో మరో 45,209 కరోనా కేసులు

దేశంలో కొవిడ్​ కేసులు మళ్లీ నిలకడగా పెరుగుతున్నాయి. కొత్తగా 45,209 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 501 మంది మహమ్మారికి బలయ్యారు.

మొత్తం కేసులు: 90,95,807

మొత్తం మరణాలు: 1,33,227

మొత్తం కోలుకున్నవారు: 85,21,617

దేశంలో కరోనా కేసుల కన్నా కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల యాక్టివ్​ కేసుల్లో తగ్గుదల నమోదవుతోంది. ఫలితంగా క్రీయాశీలక కేసుల సంఖ్యలో క్షీణత కనిపిస్తుంది. తాజాగా 43,493 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

శనివారం ఒక్కరోజే 10,75,326 కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 13 కోట్ల 17 లక్షల 33 వేలు దాటింది.

ఇదీ చూడండి: మాజీ సైన్యాధికారి ఆర్​ఎన్​ చిబ్బర్​ కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.