ETV Bharat / bharat

ఆ నలుగురి మృతి వెనక కొత్త ట్విస్ట్​

author img

By

Published : Dec 11, 2021, 8:20 PM IST

family suicide
family suicide

కర్ణాటకలో ఇటీవల ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. మతమార్పిడికి బలవంతం చేయడమే ఈ దుర్ఘటనకు కారణమని అధికారులు వెల్లడించారు.

కర్ణాటకలోని మంగళూరులో ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. నగేశ్​ అనే వ్యక్తి.. భార్య, పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈనెల 8న వెలుగులోకి వచ్చిన ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు బయటపడ్డాయి. ఆ నలుగురు మృతికి కారణం మతమార్పిడికి బలవంతం చేయడమే అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ విషయాన్ని నగేశ్​ తన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నట్టు వెల్లడించారు. మతమార్పిడికి బలవంతం చేసిన నూర్​ జహాన్​ అనే మహిళను అరెస్ట్​ చేశారు.

ఇదీ జరిగింది..

బంగల్​కోట్​ జిల్లాకు చెందిన నగేశ్​ షేరిగుప్పి విజయలక్ష్మి దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరు కొంతకాలం మ్యారేజ్​ బ్రోకర్​గా పనిచేసే నిందితురాలు నూర్​జహాన్​ అపార్టెమెంట్​లో నివసించేవారు. ఆ తర్వాత మోర్గాన్​ గేట్​లోని నివాసానికి మారారు. అయితే నగేశ్​ భార్య విజయలక్ష్మి ఆమెను కలుస్తూ ఉండేది. ఈ విషయంపైనే భార్య భర్తలకు గొడవైంది. కొద్ది రోజులు నూర్​ జహాన్​ ఇంట్లోనే ఉంది. 'నగేశ్​కు విడాకులు ఇచ్చి ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోమని నూర్​ జహాన్​ నా భార్యను బలవంతం చేసేది. నా భార్య మతం మారుతోందని తెలిసే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను' అని నగేశ్​ తన సూసైడ్​ నోట్​లో పేర్కొన్నాడు.

ఆహారంలో విషం కలిపి భార్య, పిల్లలను చంపేసి.. ఆనంతరం నగేస్​ ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి : డీజే పాటలకు నృత్యం చేస్తూ రైతుల సంబరాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.