ETV Bharat / bharat

'చెల్లెలి కొడుకే అమ్మకు ఇష్టం.. అందుకే చంపేశా'

author img

By

Published : Aug 22, 2021, 8:32 AM IST

Updated : Aug 22, 2021, 8:42 AM IST

సొంత చెల్లెలి కుమారుడినే హతమార్చింది ఓ మహిళ. తన భర్తతో కలిసి రెండేళ్ల బాబును కిడ్నాప్(Kidnap) చేసి.. గొంతు నులిమి చంపింది(Murder). గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని డ్రైనేజీ గుంటలో పడేశారు.

2-yr-old kidnapped
రెండేళ్ల బాబును చంపిన పిన్ని

రెండేళ్ల బాబును కిడ్నాప్(Kidnap) చేసి హతమార్చారు(Murder) సొంత పెద్దమ్మ, పెదనాన్న. ఆ తర్వాత మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా డ్రైనేజీ గుంటలో పడేసి వెళ్లారు. ఈ దారుణం దిల్లీలోని రాజౌరీ గార్డెన్​ పరిధిలో జరిగింది. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు.

కారణం అదేనా?

దిల్లీలోని రఘుబిర్​ నగర్​లో ఉండే యమున(24).. తన భర్త రాజేశ్​తో కలిసి సుభాష్ నగర్​లోని తన సోదరి కొడుకుని కిడ్నాప్ చేసింది. దంపతులు ఇద్దరూ.. బాబును పంజాబీ భాగ్ దగ్గర ఉన్న డ్రైనేజీ వద్దకు తీసుకెళ్లి గొంతునులిమి చంపి.. మృతదేహాన్ని డ్రైనేజీ గుంటలో పడేశారు.

'నా కూతురి కంటే.. నా సోదరి కుమారుడే మా అమ్మకు ఎక్కువ ఇష్టం అని, అందుకే బాలుడిని చంపాలని నిర్ణయించుకున్నామని' విచారణలో యమున తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన మైనర్​- డీఎన్​ఏ పరీక్షకు ఏడుగురు!

Last Updated :Aug 22, 2021, 8:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.