ETV Bharat / bharat

Covid: 2 నెలల్లో 17వేల మంది పిల్లలకు వైరస్​!

author img

By

Published : May 31, 2021, 8:59 PM IST

మహారాష్ట్రలోని ఓ జిల్లాలో కేవలం రెండు నెలల్లోనే సుమారు 17వేల మంది చిన్నారులకు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో మూడో వేవ్​లో వారిపై తీవ్ర ప్రభావం ఉంటుందనే నిపుణుల అంచనాలు బలపడుతున్నాయని అక్కడి వారు ఆందోళన చెందుతున్నారు.

పిల్లల్లో కరోనా
corona in children

మహారాష్ట్రలోని అహ్మద్​నగర్​లో రెండు నెలల్లోనే దాదాపు 17వేల మంది 18 ఏళ్ల లోపు పిల్లలు కరోనా(corona virus) బారిన పడటం కలవరపెడుతోంది. ఏప్రిల్​లో 7,760 మంది, మేలో 9,928 మందికి కలిపి మొత్తం 17,688 చిన్నారులకు వైరస్​ సోకినట్లు జిల్లా సర్జన్ డా.సునీల్​ పోఖ్​రాణా వెల్లడించారు. ఈ గణాంకాలను జిల్లా కలెక్టర్ డా.రాజేంద్ర భోస్లే ధ్రువీకరించారు.

మొత్తం పాజిటివ్​ కేసుల్లో 18 ఏళ్ల లోపు వారే 8 నుంచి 10 శాతం ఉన్నారని సునీల్ తెలిపారు. కరోనా మూడో దశ(Third Wave)లో పిల్లలే అధికంగా ప్రభావితమవుతారని నిపుణులు హెచ్చరిస్తోన్న వేళ ఈ లెక్కలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. భవిష్యత్తు తరాల ఆరోగ్యాన్ని కాపాడటానికి మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: 22 ఏళ్లలో 16 వేల శవాలకు అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.