ETV Bharat / bharat

'ముత్తూట్'​లో దొంగల బీభత్సం- 12 కిలోల బంగారం చోరీ

author img

By

Published : Sep 12, 2021, 11:24 AM IST

Updated : Sep 12, 2021, 11:37 AM IST

ముత్తూట్​ ఫైనాన్స్​(Robbery in Muthoot Finance) కార్యాలయంలోకి గుర్తు తెలియని వ్యక్తులు.. తుపాకీలతో దూసుకువచ్చారు. ఉద్యోగులను బెదిరించి, 12 కిలోల బంగారం, రూ.3 లక్షల నగదు ఎత్తుకెళ్లారు.

Robbery in Muthoot Finance
ముత్తూట్​ ఫైనాన్స్​లో దోపిడీ

'ముత్తూట్'​లో దొంగల బీభత్సం

బంగాల్​ ఆసన్​సోల్​లో(West Bengal Asansol news) దొంగలు రెచ్చిపోయారు. ముత్తూట్ ఫైనాన్స్​ సంస్థ కార్యాలయంలోకి​(Robbery in Muthoot Finance) తుపాకులతో దూసుకువచ్చి, అందినకాడికి దోచుకుని ఉడాయించారు.

అసలేమైంది?

ఆసన్​సోల్​లోని​ ముత్తూట్​ ఫైనాన్స్​ కార్యాలయంలోకి​(Robbery in Muthoot Finance) వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు.. ఉద్యోగులను తుపాకీలతో బెదిరించారు. అనంతరం లాకర్​లో నుంచి బంగారం, నగదు ఎత్తుకెళ్లారని పోలీసులు చెప్పారు. శనివారం ఉదయం ఈ ఘటన జరిగిందిని పేర్కొన్నారు.

Robbery in Muthoot Finance
ఉద్యోగులను తుపాకీతో బెదిరిస్తున్న దుండగుడు(సీసీటీవీ దృశ్యం)
Robbery in Muthoot Finance
పోలీసులకు వివరాలు వెల్లడిస్తున్న సంస్థ ఉద్యోగులు
Robbery in Muthoot Finance
దుండగుల దాడిలో గాయపడ్డ సెక్యూరిటీ గార్డు

"ఓ వ్యక్తి కార్యాలయంలోకి దూసుకువచ్చి, మాపై తుపాకీ గురిపెట్టాడు. ఆ వెంటనే మరో ముగ్గురు దుండగులు వచ్చి, సెక్యూరిటీ గార్డును కొట్టారు. వాళ్లు 12 కిలోల బంగారం, రూ.3 లక్షల నగదు ఎత్తుకెళ్లారు." అని సంస్థలో పని చేసే ఉద్యోగి సోనాలీ తెలిపారు.

ఇదీ చూడండి: సొంతిల్లు, సొంత వాహనం లేని ముఖ్యమంత్రి

Last Updated :Sep 12, 2021, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.