ఆటో ఎక్కుతుండగా విద్యార్థులకు కరెంట్​ షాక్​, ఒక్కసారిగా

By

Published : Aug 23, 2022, 9:52 AM IST

thumbnail

ఉత్తరాఖండ్​లోని దేహ్రాదూన్​లో త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు ఇద్దరు విద్యార్థులు. నగరంలోని సెయింట్​ థామస్​ స్కూల్​లో చదువుతున్న స్టూడెంట్స్​.. ఆటో కోసం సమీపంలో ఉన్న బస్​స్టాప్​లో వేచిచూస్తున్నారు. అదే సమయంలో భారీగా వర్షం కురుస్తోంది. ఆటో వచ్చిందనే హడావుడిలో ఎక్కేందుకు ఓ విద్యార్థి వర్షపు నీటిలో దిగాడు. ఆటోను టచ్​ చేసిన వెంటనే కరెంట్​ షాక్​కు గురయ్యాడు. ఆ తర్వాత మరో విద్యార్థిని కూడా ఆటో ఎక్కేందుకు ప్రయత్నించింది. ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై వరద నీటిలో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు.. ఇద్దరు చిన్నారులను కాపాడారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.