RAINS: బంగాళాఖాతంలో అల్పపీడనం..పలు జిల్లాల్లో వర్షాలు
ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల పాటు మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. యానాంతో పాటు కోస్తాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తాతోపాటు రాయలసీమలోనూ కొన్నిచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తాంధ్ర తీరం వెంబడి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నట్టు అధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారినందున.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
TAGGED: