వైసీపీకీ ఓటేస్తేనే పథకాలు ఇస్తామన్న ఎమ్మెల్యే.. వేసేది లేదన్న మహిళ

By

Published : Apr 13, 2023, 12:29 PM IST

thumbnail

YCP GADAPA GADAPA PROGRAM: గడప గడపలో వైసీపీ ప్రజాప్రతినిధులకు నిరసన సెగ తప్పడం లేదు. ఏ గ్రామానికి వెళ్లినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం జి. సిడగాం మండలంలోని మెట్టవలస, గోబ్బురులో.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్​ను ప్రజలు నిలదీశారు. గ్రామానికి రహదారి, తాగునీరు సౌకర్యం సక్రమంగా లేదని వారి గోడును వినిపించారు. రేషన్ కార్డు తీసేశారని ఒకరు.. ఉన్న పింఛన్​ను తొలగించారని మరొకరు నాయకుడిని ప్రశ్నించారు. ఎక్కువ భూమి ఉంటే పథకం రాదని చెప్పి ఎమ్మెల్యే జారుకున్నారు. అక్కడినుంచి మరో వీధికి వెళ్తే అక్కడా కూడా అవే ప్రశ్నలు. సంక్షేమ పథకాలు రావట్లేదు.. వైకాపా ప్రభుత్వానికి ఓటు వేయమని ఓ మహిళ ముక్తకంఠంతో చెప్పింది. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తేనే.. పథకాలు ఇస్తాం.. లేకుంటే ఇవ్వం మీరే ఆలోచించుకోండి అంటూ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.