పుట్టపర్తిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన - రెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 21, 2023, 9:22 PM IST

Updated : Nov 22, 2023, 12:14 PM IST

thumbnail

SP Madhava Reddy on President Droupadi Murmu visit: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి రాబోతున్నారని.. జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సాయి హీరా గ్లోబల్‌ ప్రైవేటు కన్వెన్షన్ హాల్‌లో జరగనున్న సత్యసాయి ఇనిస్టిట్యూట్​ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 42వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొననున్నారని ఆయన వెల్లడించారు. 

SP Madhava Reddy Comments: ''రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పుట్టపర్తికి రాబోతున్నారు. సాయి హీరా గ్లోబల్‌ ప్రైవేటు కన్వెన్షన్ హాల్‌లో జరిగే సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 42వ స్నాతకోత్సవంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు డీగ్రీలు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతితోపాటు గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా నాలుగు జిల్లాల పోలీసులు, గ్రేహౌండ్స్ పోలీస్ బెటాలియన్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం. బుధవారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు రాష్ట్రపతి పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుని.. ప్రశాంతి నిలయంలోని మహా సమాధిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి కన్వెన్షన్ హాల్‌కు చేరుకుని, విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు తిరిగి విమానాశ్రయంకు చేరుకుంటారు'' అని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి  తెలిపారు. 

Last Updated : Nov 22, 2023, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.