Road accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

By

Published : Jul 17, 2023, 3:33 PM IST

Updated : Jul 17, 2023, 3:47 PM IST

thumbnail

Road accident on Duvvur National Highway: నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు వద్ద ఉన్న జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొనగా ముగ్గురు యువకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు నుండి ఏఎస్​ పేట మండలం వైపు వెళ్తున్న మోటార్ సైకిల్.. సిద్దీపురం నుండి బుచ్చిరెడ్డిపాలెం వైపు వస్తున్న మరో మోటార్ సైకిల్​ను వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందగా మరొక యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో గాయాలైన వ్యక్తిని టోల్ ప్లాజా అంబులెన్స్ ద్వారా వెంటనే బుచ్చిరెడ్డిపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు ఏఎస్‌పేట మండలం చెందులూరుపాడుకు చెందిన లక్ష్మీనారాయణ, మిక్కిలింపేటకు చెందిన మధు, నెల్లూరుకు చెందిన పవన్​గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై ఆయా గ్రామాలలోని మృతుల కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Last Updated : Jul 17, 2023, 3:47 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.