Nara Lokesh Assurance to Polavaram Residents : 'మాయమాటలు చెప్పం.. పరదాలు కట్టుకుని తిరగం.. పోలవరం కట్టేది చంద్రబాబే'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2023, 7:23 PM IST

thumbnail

Nara Lokesh Assurance to Polavaram Residents: 'మెడపై కత్తి పెట్టినా ఆచరణ సాధ్యం కాని హామీలివ్వను.. మేం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరతాం.. జగన్​లా మాయమాటలు చెప్పం.. పరదాలు కట్టుకుని తిరగం' అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  అన్నారు. పోలవరం ఆర్ అండ్‌ ఆర్ ప్యాకేజీ విషయంలో జగన్‌ మాటలు నమ్మి మోసపోయామని నిర్వాసితులు లోకేశ్ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా.. పోలవరం నిర్వాసితులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. కేంద్రం  ఇస్తేనే ఆర్ అండ్‌ ఆర్ ఇస్తామని జగన్ అంటున్నారని.. నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం లేదని.. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆదుకోవాలని కోరారు. నిర్వాసితుల కష్టాలను విన్న లోకేశ్.. తాము అధికారంలోకి రాగానే టీడీపీ ప్రకటించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతం ప్రమాదంలో ఉందన్న లోకేశ్.. డయాఫ్రం వాల్‌ పరిస్థితి ఏమిటో స్పష్టత లేదని చెప్పారు. పోలవరం పూర్తి చేసేది చంద్రబాబే అని స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.