MPTC Fires on YSRCP MLA నాకే పదవి రాకుండా చేస్తావా..! వైసీపీ ఎమ్మెల్యేను కడిగిపారేసిన ఎంపీటీసీ..!

By

Published : Jul 30, 2023, 10:32 PM IST

thumbnail

MPTC Fires on YSRCP MLA: వైసీపీలో నేతల మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా అధికార వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యేను ఎంపీటీసీ కడిగిపారేశారు. ద్రోహం చేశారంటూ శాపనార్థాలు పెట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ఓజిలి మండలం కురుగొండలో వైసీపీకి చెందిన మాజీ ఎంపీపీ ఇందిరమ్మ ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో గడప దాటి ఇంట్లోకి వెళ్లగానే ఎమ్మెల్యేను ఇందిరమ్మ నిలదీశారు. రెండో సారి తనకు ఎంపీపీ పదివి రాకుండా ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. తనకు పదవులు కొత్త కాదని తాను వదిలేసిన పదవి కోసం తానెప్పుడూ బాధపడలేదని ఇందిరమ్మ అన్నారు. తమ గడపకు ఎందుకు వచ్చారని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై ఆగ్రహించి శాపనార్థాలు పెట్టారు. భర్త ప్రభాకర్‌ అడ్డుకున్నా వినకుండా ఎమ్మెల్యే సంజీవయ్యను ఇందిరమ్మ కడిగిపారేశారు. కాగా ప్రస్తుతం ఇందిరమ్మ వైసీపీ ఎంపీటీసీగా ఉన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.