గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన.. వీడియో వైరల్​.. సీఎం సీరియస్​!

By

Published : Jul 4, 2023, 10:30 PM IST

thumbnail

మధ్యప్రదేశ్​.. సీదీలో ఓ గిరిజన యువకుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారి.. పోలీసుల దృష్టికి చేరింది. దీంతో పోలీసులు గిరిజన యువకుడిపై మూత్రం పోసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనపై రాజకీయ వివాదం నెలకొంది. నిందితుడికి.. భారతీయ జనతా పార్టీతో సంబంధం ఉందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని పేర్కొంది. మరోవైపు.. నిందితుడు ప్రవేశ్ శుక్లాపై బహారీ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైందని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారి ఒకరు తెలిపారు.  

'సీదీ జిల్లాలో జరిగిన ఒక వైరల్ వీడియో నా దృష్టికి వచ్చింది. దోషిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను' అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్​సింగ్ చౌహాన్​ తెలిపారు. మరోవైపు.. మధ్యప్రదేశ్​ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్​నాథ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. 'సీదీ జిల్లాకు చెందిన గిరిజన యువకుడిపై ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేసిన దారుణానికి సంబంధించిన వీడియో నా దృష్టికి వచ్చింది. ప్రస్తుత నాగరిక సమాజంలో ఇలాంటి హేయమైన చర్యకు చోటులేదు. నిందితుడికి బీజేపీతో సంబంధం ఉంది. ఈ ఘటన యావత్​ రాష్ట్రాన్ని సిగ్గుపడేలా చేసింది. దోషులను కఠినంగా శిక్షించాలి. మధ్యప్రదేశ్‌లో గిరిజనులపై అఘాయిత్యాలను ఆపాలి' అని కమల్​నాథ్ అన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.