డబ్బులివ్వాలని జగనన్న లేఔట్ గుత్తేదారునికి వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 13, 2024, 2:11 PM IST

thumbnail

Jagananna Layout Contractor Complains to Police Against YCP MLA: అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డబ్బు కోసం బెదిరిస్తున్నారని జగనన్న లేఔట్ గుత్తేదారు సర్వార్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతపురం గ్రామీణ మండలం కొడిమి వద్ద జగనన్న లేఔట్‌ అభివృద్ధి పనులను బంగాల్‌కు చెందిన గుత్తాదారు సర్వార్ జహాన్‌ చేపట్టారు. డబ్బులు ఇవ్వాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి బెదిరించారని పోలీసుల ద్వారా సమస్యలు సృష్టిస్తున్నారని జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు గుత్తేదారు ఫిర్యాదు చేశారు. లేఔట్‌లో పనిచేస్తున్న 9 మంది కూలీలను అనంతపురం గ్రామీణ పోలీసులు నిర్బంధించారని వారిని విడిపించాలని కోరారు. తమ కూలీలను విడిపించాలని సర్వార్ జహాన్ బంగాల్ ఎంపీ ఏకే ఖాన్ చౌదరికి ఫిర్యాదు చేశారు. 

గుత్తేదారు ఫిర్యాదుతో ఎంపీ ఏకే ఖాన్ చౌదరి జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు లేఖ రాశారు. పోలీసులు నిర్బంధించిన తమ నియోజకవర్గానికి చెందిన 9 మంది కూలీలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి బెదిరిస్తున్నట్లుగా చెబుతున్న గుత్తేదారు అందుకు సంబంధించిన ఫోన్ కాల్ డేటాను బయటపెట్టారు. మెయిల్ ద్వారా ఫిర్యాదు తీసుకున్న జిల్లా ఎస్పీ అన్బురాజన్, డీఎస్పీని జగనన్న లేఔట్ వద్దకు పంపించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.