Illegal Sand Mining in YSR District: సీఎం సొంత జిల్లాలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా.. అడ్డుకున్న టీడీపీ నేతలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 22, 2023, 6:09 PM IST

thumbnail

Illegal Sand Mining in YSR District: పర్యావరణ అనుమతులు వచ్చే వరకూ రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలను చేపట్టరాదని ఎన్జీటీ స్పష్టం చేసినా.. ఇసుకాసురులు ఆగడం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఇసుక రవాణా ఎన్నిసార్లు అడ్డుకున్నా కొనసాగుతూనే ఉంది. దీంతో యథేచ్ఛగా ఇసుకని తరలిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రి, నంది మండలాల్లో ఇసుక అక్రమ రవాణాను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. టీడీపీ నేత గంగిరెడ్డి కిషోర్ రెడ్డి మరికొందరు నాయకులతో కలిసి అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాను అడ్డుకున్నారు. టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో అక్రమ ఇసుకను ఎక్కడికక్కడే ఆపేశారు. ఇసుక తవ్వకాలకు సంబంధించిన అనుమతులు ఉన్నాయా అని నిర్వాహకులను ప్రశ్నించారు. పత్రాలు చూపించమని నిలదీశారు. ఓవైపు పర్యావరణ అనుమతులు వచ్చేవరకు ఇసుక తవ్వకాలను ఆపాలని ఎన్జీటీ చెప్పినప్పటికీ అవేవీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక తవ్వకాలపై దృష్టి సారించాలని టీడీపీ నేతలు కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.