'మీ అమ్మను చంపేశా' - కర్నూలు లాడ్జి ఘటనలో కీలక మలుపు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 12:34 PM IST

Updated : Dec 16, 2023, 1:17 PM IST

thumbnail

Two People Died in Kurnool Lodge: లాడ్జిలో ఇద్దరు మృతితో కర్నూలు నగరం ఉలిక్కిపడింది. ఓ లాడ్జిలో పురుషుడు, మహిళ మృతి చెందారు. దీంతో ఘటన గురించి లాడ్జి నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా దారుణానికి గల కారణాలను సైతం గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

కర్నూలు నగరంలోని వుడ్‌ల్యాండ్ లాడ్జిలో నందికొట్కూరుకు చెందిన విజయ్, రుక్సానా అనే ఇద్దరు మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన లాడ్జి సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే తొలుత దుండగులు హత్య చేసి ఉంటారు అని భావించగా, అనంతరం విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. రుక్సానాను హత్యచేసి, ఆ తర్వాత విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు ముందు రుక్సానా కుమారుడికి విజయ్ సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. రుక్సానా, విజయ్ కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. రుక్సానాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. హత్య, ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాలను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Last Updated : Dec 16, 2023, 1:17 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.