Clash Between Two Groups in Mangalagiri : ఇరువర్గాల ఘర్షణ.. పోలీసుల ఏకపక్ష వైఖరికి నిరసనగా ధర్నా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2023, 7:55 PM IST

thumbnail

Clash Between Two Groups in Mangalagiri : గుంటూరు జిల్లా మంగళగిరి ద్వారకా నగర్​లోని ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరు వర్గాల నాయకులు ఘర్షణకు దిగారు. తోట శ్రీను వర్గం నాయకులు తమపై దాడి చేశారంటూ తాడిపైన ఉమా యాదవ్ వర్గీయులు మంగళగిరి బస్టాండ్ వద్ద రాస్తారోకో చేశారు. తోట శ్రీను మనుషుల చేతిలో గాయపడ్డ మహిళతో ధర్నా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పట్టణ సీఐ అంకమ్మ రావుల ప్రోద్బలంతో తోట శ్రీను వర్గం తమపై దాడులు చేస్తున్నారని ఉమా యాదవ్ వర్గీయులు ఆరోపించారు.

తోట శ్రీను వర్గం మంగళవారం ఉదయం తమపై దాడులకు పాల్పడ్డారని పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తోట శ్రీను మనుషులు తమ తల్లిపై దాడి చేసి తీవ్రంగా గాయరిచారని చెప్పారు. తమపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయకపోతే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దాడి చేసిన వారిని సాయంత్రంలోపు అరెస్ట్ చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. గాయపడ్డ మహిళను ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.