Arguments in ACB Court: లాయర్​ అవతారమెత్తిన చంద్రబాబు.. తన కేసును తానే వాదించుకున్న టీడీపీ అధినేత

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 9:40 AM IST

Updated : Sep 10, 2023, 10:39 AM IST

thumbnail

Arguments in ACB Court: ఏసీపీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. విచారణలో భాగంగా చంద్రబాబు స్టేట్‌మెంట్‌ రికార్డు పూర్తయింది. తన వాదనకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు కోరగా.. న్యాయమూర్తి అందుకు అనుమతినిచ్చారు. ఈ క్రమంలో స్వయంగా వాదనలు వినిపించిన చంద్రబాబు... తన అరెస్టు అక్రమని తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో తనకెలాంటి సంబంధం లేదని... రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని వివరించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు కేబినేట్‌ తీసుకున్న నిర్ణయమని... ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్‌ చర్యలు తీసుకోడానికి వీల్లేదని అన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు 2015-16లోనే బడ్జెట్‌లోనే పొందుపరిచామని... దానిని రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించినట్లు స్పష్టం చేశారు. 

శాసన సభ ఆమోదించిన బడ్జెట్‌ కేటాయింపులను క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరని అన్నారు. 2021 డిసెంబర్‌ 9న నమోదు చేసిన F.I.Rలో కాని.... రిమాండ్‌ రిపోర్టులో కాని తన పాత్ర ఉందని సీఐడీ ఎక్కడా పేర్కొనలేదని చంద్రబాబు వాదనలు వినిపించారు. 

సీఐడీ రిమాండ్​ రిపోర్ట్​: మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబును అరెస్టు చేసి ఏసీబీ కోర్టు ముందు హాజరు పరిచిన సీఐడీ అధికారులు రిమాండ్ రిపోర్టును కోర్టులో దాఖలు చేశారు. స్కిల్ డెవలప్​మెంట్ వ్యవహారంలో చంద్రబాబను ప్రధాన కుట్రదారుగా పేర్కోన్న సీఐడీ ఆయన్ను ఏ37 గానే పేర్కొంటూ రిమాండ్ రిపోర్టు సమర్పించింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంతో పాటు వివిధ అక్రమాల్లో ఆయన పాత్ర ఉందని స్పష్టం చేస్తూ తదుపరి విచారణ కోసం ఆయనకు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వాలని పేర్కోంది. ఈమేరకు సీఐడీలోని ఆర్ధిక నేరాల విభాగం డీఎస్పీ ధనుంజయుడు పేరిట రిమాండ్ రిపోర్టును ఏసీబీ కోర్టుకు సమర్పించింది. 

Chandrababu in ACB Court: ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరు పర్చిన సీఐడీ  స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో రిమాండ్ రిపోర్టు సమర్పించింది. రిమాండ్ రిపోర్టులో చంద్రబాబును ఏ 37 గానే పేర్కోంటునే అభియోగాలను పేర్కోంది. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారానికి సంబంధించిన నేరంలో  ఆయనే  ముఖ్యమైన కుట్రదారని స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధిగా ఉండి ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని పేర్కోంది.  2021 డిసెంబరు 9 కంటే ముందు ఈ నేరం జరిగిందని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది.  తాడేపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కేంద్రంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ అక్రమాలు జరిగాయని వెల్లడించింది.

 స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి సీమెన్స్ ప్రాజెక్టు కోసం  ప్రభుత్వ వాటాగా 371 కోట్ల రూపాయలను చెల్లించారని పేర్కోంది. ఇందులో 279 కోట్ల రూపాయల మేర ప్రజాధనం షెల్ కంపెనీలకు దారిమళ్లాయని పేర్కోంటూ రిమాండ్ రిపోర్టు దాఖలు చేసింది. ఏపీలోని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం  అమలు కోసం సీమెన్స్ ఇండస్ట్రీస్ సాఫ్ట్ వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ , మెస్సర్స్ డిజైన్ టెక్ సిస్టమ్స్ లిమిటెడ్ పేరిట ఈ కుంభకోణం జరిగిందని పేర్కోంది.  రాష్ట్రవ్యాప్తంగా 6 సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాలు అలాగే 36 టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు ఏర్పాటు చేయటం లక్ష్యంగా ఒప్పందం చేసుకున్నారని..

Chandrababu Arrest News Updates : సీమెన్స్ ద్వారా చేపట్టనున్న ప్రాజెక్టు వ్యయాన్ని 3281  కోట్ల రూపాయల మేర  ఉంటుందని పేర్కోన్నారని స్పష్టం చేసింది.  ఇందులో 10 శాతం రాష్ట్రవాటాగా జీవో నెంబరు 4 ద్వారా టెక్నాలజీ భాగస్వాములైన మెస్సర్స్ డిజైన్ టెక్ లిమిటెడ్ కు 371 కోట్లను విడుదల చేశారని రిమాండ్ రిపోర్టులో తెలిపింది. చెల్లింపులు జరిగిన మొత్తానికి సంబంధించిన వస్తుసేవలను మెస్సర్స్ డిజైన్ టెక్ సంస్థ ప్రభుత్వానికి అందించలేదని  సీఐడీ స్ఫష్టం చేసింది. అలాగే 241 కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీల్లో నకిలీ బిల్లులు ఉన్నట్టుగా మహారాష్ట్రలోని జీఎస్టీ ఇంటెలిజెన్స్ గుర్తించినట్టు పేర్కోంది.

Last Updated : Sep 10, 2023, 10:39 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.