APNGO Leaders Met CS: సమస్యలు వెంటనే పరిష్కరించాలి.. సీఎస్​ ఉద్యోగసంఘాల వినతి

By

Published : Jun 25, 2023, 11:00 AM IST

thumbnail

APNGO, APTF Leaders Meets Chief Secretary: ఏపీఎన్జీవో, ఏపీటీఎఫ్​ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్​ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలను, డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఎస్​ను కోరినట్లు వారు తెలిపారు. సీఎస్​తో తమ సమస్యలు విన్నవించకున్న ఇరు సంఘాల నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలపై సీఎస్​తో చర్చించినట్లు వారు వెల్లడించారు. దీనిపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తామని సీఎస్​ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల పెన్షనర్ల 25 డిమాండ్లను సీఎస్​కు వివరించినట్లు వారు తెలిపారు. అరియర్లను నగదు రూపంలో పెన్షనర్లకు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులను ఓపీఎస్ ఉద్యోగులుగా మార్చాలని కోరామని.. మిగిలిన కాంట్రాక్టు ఉద్యోగులను, లెక్చరర్లను రెగ్యులరైజ్​ చేయాలని వివరించామన్నారు. పే అండ్ అకౌంట్స్ ఆఫీసులో అర్హత కలిగిన అధికారులకు పదోన్నతి కల్పించాలని కోరినట్లు వివరించారు. కాంట్రాక్టు ఉద్యోగులను నియామాకాల్లో నిబంధనలను సడలించాలని కోరినట్లు వివరించారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.