వేధింపుల ఆరోపణలపై ఇద్దరు సీఐలపై వేటు - వీఆర్​కు పంపించిన ఎస్పీ అన్బురాజన్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 8, 2023, 10:22 PM IST

thumbnail

Anantapur SP Actions on Circle Inspectors: అనంతపురం జిల్లాలో ఇద్దరు సీఐలపై వేటు పడింది. అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఇద్దరు సీఐలను వీఆర్​కు పంపుతూ ఆదేశాలు ఇచ్చారు. తాడిపత్రి సీఐ హమీద్ ఖాన్ ఒక యువకుడికి విద్యుత్ షాకిచ్చి వేధించాడనే ఆరోపణ రావటంతో విచారణ చేపట్టారు. దీంతో ఇవాళ తాడిపత్రి సీఐ హమీద్ ఖాన్​ను వీఆర్​కు పంపారు. అదే విధంగా బుక్కరాయసముద్రం సీఐ నాగార్జున రెడ్డిని సైతం వీఆర్​కు పంపారు. మహానందరెడ్డి అనే దివ్యాంగుడిని స్టేషన్​కు పిలిచి సీఐ నాగార్జున రెడ్డి లాఠీతో విచక్షణా రహితంగా కొట్టారని ఆరోపణలు వచ్చాయి. సీఐ నాగార్జున రెడ్డి లాఠీ దెబ్బలకు తట్టుకోలేక మహానందరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. 

విషమ పరిస్థితుల్లో అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో విచారణ చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. నిందితుల పట్ల అమానుషంగా వ్యవహరించిన సీఐలు హమీద్ ఖాన్, నాగార్జున రెడ్డిల గురించి మీడియాలో సైతం ప్రసారం కావటంతో ఎస్పీ స్పందించారు. ఇద్దరినీ వీఆర్​కు పంపుతున్నట్లు ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.