చేతులతో నాలుగు బుల్లెట్లను ఆపిన యువకుడు.. పళ్లతో కారును లాగిన వ్యక్తి

By

Published : Feb 6, 2023, 5:10 PM IST

Updated : Feb 14, 2023, 11:34 AM IST

thumbnail

పంజాబ్​ లూధియానా జిల్లాలోని ఖిలా రాయ్​పుర్​లో జరుగుతున్న గ్రామీణ క్రీడాపోటీల్లో యువకులు సత్తా చాటుతున్నారు. సాహసాలు చేస్తూ అదరగొడుతున్నారు. ఈ సందర్భంగా లవ్​దీప్ సింగ్ అనే వ్యక్తి.. బుల్లెట్ బైక్​లకు తాళ్లు కట్టి వాటిని ముందుకు పోకుండా ఆపి ఔరా అనిపించాడు. తనకు ఇరువైపులా రెండు బైక్​లను ఉంచి వాటికి తాళ్లు కట్టిన లవ్​దీప్.. ద్విచక్రవాహనాలను స్టార్ట్ చేయాలని యువకులకు సూచించాడు. వారు గేర్ వేసి బైక్ రేస్ చేసినప్పటికీ.. బుల్లెట్లు ముందుకు కదలలేదు. సన్నని తాళ్ల ఆసరాతోనే బైక్​లను ముందుకు పోనీయకుండా నిలువరించాడు లవ్​దీప్. గతకొన్ని సంవత్సరాలుగా ఈ క్రీడల్లో పాల్గొంటున్నట్లు చెప్పాడు 24 ఏళ్ల లవ్​దీప్. ఇప్పటివరకు జిమ్​కు వెళ్లలేదని, స్థానికంగా దొరికే ఆహారాన్నే తింటానని చెబుతున్నాడు.

మరోవైపు, ఇదే క్రీడల్లో ఫరీద్​కోట్ జిల్లాకు చెందిన జగ్దీప్ సింగ్ అనే 36ఏళ్ల వ్యక్తి.. పళ్లతో ఏకంగా కారునే లాగేశాడు. ప్రయాణికుల బరువుతో కలిపి 500 కిలోలు ఉన్న మారుతీ కారుకు తాడు కట్టి కొద్దిదూరం వరకు లాక్కెళ్లాడు. జగ్దీప్ సాహసాన్ని చూసి వీక్షకులు చప్పట్లతో అభినందించారు. గత పదేళ్లుగా ఇలాంటి సాహసాలు చేస్తున్నానని జగ్దీప్ తెలిపాడు. యువత డ్రగ్స్​కు బానిస కాకూడదని, మంచి ఆహారం తినాలని సలహా ఇస్తున్నాడు. 

Last Updated : Feb 14, 2023, 11:34 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.