ETV Bharat / state

Srikanth Reddy on BJP: 'మాకు ప్రజాబలం ఉంది.. ఆర్మీ బలగాలు దించినా ఇబ్బంది లేదు'

author img

By

Published : Oct 25, 2021, 7:23 PM IST

Srikanth Reddy on BJP
Srikanth Reddy on BJP

భాజపా రాష్ట్ర నాయకులపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు(chief whip srikanth reddy fires on state bjp leaders). బద్వేలు అధికారులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక సందర్భంగా మొత్తం ఆర్మీ బలగాలను దించినా తమకేం ఇబ్బంది లేదన్నారు.

బద్వేలు అధికారులపై భాజపా లేనిపోని ఆరోపణలు చేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్‌ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు(chief whip gadikota srikanth reddy fires on state bjp leaders news). బద్వేలులో(badvel bypoll 2021 news) తమకు ప్రజాబలం ఉందన్నారు. మిలిటరీ బలగాలు పెంచి హడావిడి చేసేందుకు భాజపా యత్నిస్తోందని ఆరోపించారు. మొత్తం ఆర్మీ బలగాలు దించినా తమకేం ఇబ్బంది లేదన్నారు.

ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

'నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలని మేమూ కోరుతున్నాం. విభజన చట్టం హామీలు నెరవేరిస్తే పోటీ నుంచి తప్పుకుంటాం. విభజన చట్టంలోని హామీలనే మేం అడుగుతున్నాం. ప్రత్యేక హోదా, దుగరాజపట్నం పోర్టు, ఉక్కు పరిశ్రమ ఇవ్వాలి. ప్రత్యేక హోదా ఇస్తామని స్వయంగా ప్రధానమంత్రే చెప్పారు' - శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్

ఇదీ చదవండి: BJP COMPLAINT: బద్వేలులో వైకాపా అధికార దుర్వినియోగం.. చర్యలు తీసుకోండి: భాజపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.