ETV Bharat / state

సాయంత్రం గంగిరెడ్డి అంత్యక్రియలు..హాజరుకానున్న సీఎం జగన్​

author img

By

Published : Oct 3, 2020, 12:27 PM IST

Updated : Oct 3, 2020, 2:26 PM IST

arrangements are complete to   ec gangi reddy 's  funeral
స్వగృహంలో ఈసీ గంగిరెడ్డి పార్ధివదేహాం ఉంచడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి

కడప జిల్లా పులివెందులలో సాయంత్రం సీఎం జగన్ మామ గంగిరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

గంగిరెడ్డి పార్థివదేహం కడప జిల్లా పులివెందులకు చేరుకుంది. ప్రజల సందర్శనార్థం గంగిరెడ్డి ఇంటివద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం రాజారెడ్డి సమాధుల తోట వద్ద అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియల కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రానున్నారు. డీఎస్పీ వాసుదేవన్ భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

ఇదీ చూడండి. సీఎం జగన్‌ మామ ఈసీ గంగిరెడ్డి మృతి

Last Updated :Oct 3, 2020, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.