ETV Bharat / state

TOP NEWS : ఏపీ ప్రధాన వార్తలు @ 5PM

author img

By

Published : Dec 20, 2022, 4:59 PM IST

TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

.

  • నెల్లూరు జిల్లాలో కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి
    నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుడ్లూరు మండలం మోచర్ల వద్ద రోడ్డు నిర్మాణ కార్మికులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'పంట నష్టపోయిన రైతుకు.. ఎకరాకు రూ. 20వేల పరిహారమివ్వాలి'
    తుపాన్ కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా నేతలు డిమాండ్​ చేశారు. ర్యాలీగా వచ్చి నెల్లూరు కలెక్టరేట్‌ దగ్గర ధర్నా చేశారు. రైతులను ఆదుకోవాలంటూ.. కలెక్టర్​కు వినతిపత్రం అందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • శ్రీశైలంలో దుకాణాల తొలగింపులో అధికారుల ముందడుగు.. జేసీబీతో గుంతల తవ్వకం
    శ్రీశైలం మల్లిఖార్జున స్వామివారి దేవస్థానానికి ఇరువైపుల ఉన్న పాత దుకాణాల తరలింపునకు అధికారులు ముందడుగు వేశారు. వ్యాపారులకు కొత్త సముదాయాలు కేటాయించిన అక్కడికి వెళ్లకపోవడంతో అధికారులే దగ్గరుండి జేసీబీ సాయంతో దుకాణాల ముందు గుంతలు తీయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అక్షింతలు వేసి వచ్చేలోపే.. 65 సవర్ల బంగారం చోరీ
    గుంటూరు అరండల్​పేట స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఓ కల్యాణ మండపంలో 19వ తేదీ రాత్రి వివాహం జరిగింది. వెంకటకృష్ణ అనే వ్యక్తి తన ఇంట్లో ఉన్న బంగారం బ్యాగులో పెట్టుకొని వివాహానికి వచ్చాడు. తన బ్యాగ్​ను కుర్చీలో పెట్టి.. అక్షింతలు వేసేందుకు వెళ్లాడు.. తిరిగి వచ్చి చూసేసరికి బ్యాగ్​ మాయమైంది. దీంతో లబోదిబోమనుకుంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అమ్మాయి ట్విస్ట్‌: నన్నెవరూ కిడ్నాప్‌ చేయలేదు..పెళ్లి చేసుకుందామని వెళ్లా..!
    తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువతి కిడ్నాప్ ఊహించని మలుపు చోటుచేసుకుంది. తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదంటూ కిడ్నాప్ కు గురైన యువతి.. ఓ వీడియోను విడుదల చేసింది. జానీ అనే యువకుడిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నట్లు చెప్పిన యువతి.. జానీని పెళ్లి చేసుకుంటున్న వీడియోను విడుదల చేసింది. దీంతో కిడ్నాప్ కేసులో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'కేజ్రీవాల్ పార్టీకి రూ.60 కోట్లు ఇచ్చా.. వారిపై చేసిన ఆరోపణలన్నీ నిజమే'
    ఆమ్ ఆద్మీ పార్టీకి రెండు విడతలుగా రూ.60 కోట్లు ఇచ్చానని ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ చెప్పుకొచ్చాడు. తాను గతంలో కేజ్రీవాల్, ఆయన మంత్రులపై చేసిన ఆరోపణలన్నీ నిజమేనని అన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'నాకు గర్ల్​ఫ్రెండ్​గా మారితే పరీక్షలో పాస్ చేస్తా'.. యువతికి ప్రపోజల్.. నో అనగానే మళ్లీ ఫెయిల్
    ఫెయిల్ అయిన సబ్జెక్ట్​కు రీకౌంటింగ్ కట్టిన యువతికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి విచిత్ర ప్రతిపాదన వచ్చింది. పరీక్షలో పాస్ కావాలనుకుంటే.. డబ్బులు ఇవ్వాలని, తనకు గర్ల్​ఫ్రెండ్​గా మారాలని ఓ వ్యక్తి యువతికి మెసేజ్ చేశాడు. ఈ ప్రతిపాదనను తిరస్కరించగా.. మరోసారి సబ్జెక్ట్​లో ఫెయిల్ అయింది యువతి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
    దేశంలో బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అనుకున్నట్టే జరిగింది... హిట్​మ్యాన్​తో పాటు అతడు కూడా..
    గాయపడిన కెప్టెన్​ రోహిత్ శర్మ ఇంకా కోలుకోలేదు. దీంతో అతడు బంగ్లాతో జరగబోయే రెండో టెస్టుకు దూరంకానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే హిట్​మ్యాన్​తో పాటు మరో కీలక ప్లేయర్​ కూడా అందుబాటులో ఉండడని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఈ నేచురల్​ బ్యూటీ కథలో రాజకుమారి
    తనదైన శైలి నటన, అందం​తో బుల్లితెర ఆడియెన్స్​ను మెస్మరైజ్​ చేసిన కన్నడ బ్యూటీ భూమి శెట్టి. చిన్నప్పట్టి నుంచే కలలపై మక్కువ ఉన్న ఈ ముద్దుగుమ్మ సీరీయల్స్​లో నటించి క్రేజ్​ తెచ్చుకుంది. బిగ్​బాస్​తో మరింత పాపులర్​ అయింది. ఆ తర్వాత తెలుగు తెరకు నిన్నే పెళ్లాడతా అనే సీరియల్​ ద్వారా పరిచమై ఇక్కడి ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఆ తర్వాత కథలో రాజకుమారి అనే మరో సీరియల్​ ద్వారా ఆడియెన్స్​ను ఫిదా చేసి ఫ్యాన్స్​ను సంపాదించుకుంది. అనంతరం రెండు మూడు చిత్రాల్లోనూ నటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.