ETV Bharat / state

Suspicious death: వసతి గృహంలో బాలిక అనుమానాస్పద మృతి

author img

By

Published : Oct 28, 2021, 6:47 PM IST

Suspicious death
Suspicious death

పశ్చిమగోదావరి జిల్లా(west godavari district) మార్టేరు బాలికల వసతి గృహంలో విద్యార్థిని అనుమానాస్పద స్థితి(girl Suspicious death) లో మృతి చెందింది. వసతి గృహంలో ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సిబ్బంది తెలిపారు. బాలికకు పై సీలింగ్ ఫ్యాను అందే పరిస్థితి లేదని.. అలాంటిది ఉరి ఎలా వేసుకొని ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా(west godavari district) మార్టేరు బాలికల వసతి గృహంలో ఎనిమిదో తరగతి చదువుతున్న స్రవంతి అనే విద్యార్థిని అనుమానస్పద స్థితి(girl Suspicious death)లో మృతి చెందింది. వసతి గృహంలో ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సిబ్బంది తెలిపారు. పోలీసులు మాత్రం బాలిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. బాలికకు పై సీలింగ్ ఫ్యాను అందే పరిస్థితి లేదని... అలాంటిది ఉరి ఎలా వేసుకొని ఉంటుందన్న అనుమానులు వ్యక్తమవుతున్నాయి. వసతి గృహంలో మృతురాలితో మరో బాలిక గొడవ పడిందని తోటి విద్యార్థులు తెలిపారు. పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి

suicide: రాత్రి ఇంటికి రాలేదని తండ్రి మందలించాడని..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.