పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో గతంలో పనిచేస్తూ సస్పెండ్ అయిన గృహనిర్మాణ శాఖ ఏఈ నాగరాజుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై మంగళవారం ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఇంటి బిల్లులు విడుదల చేసేందుకు నాగరాజు రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశారని మొగల్తూరుకు చెందిన వీరాంజనేయులు స్పందనలో ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏలూరు ఇన్స్పెక్టర్ రవీంద్ర సిబ్బందితో కలిపి మొగల్తూరులో గృహ నిర్మాణ శాఖ కార్యాలయానికి వచ్చి బాధితులను విచారించి వివరాలు నమోదు చేశారు. ఈ విచారణలో ఏసీబీ ఎస్ఐ శ్రీనివాసరాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: