ETV Bharat / state

గృహనిర్మాణ శాఖ ఏఈ అవినీతి ఆరోపణలపై అనిశా విచారణ

author img

By

Published : Mar 16, 2021, 9:23 PM IST

Mughalturu
గృహనిర్మాణ శాఖ ఏఈపై అనిశా విచారణ

మొగల్తూరులో గృహ నిర్మాణ శాఖ ఏఈ నాగరాజు అవినీతి ఆరోపణలపై అనిశా అధికారులు విచారణ చేశారు. ఇంటి బిల్లుల విషయంలో రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారని స్పందనలో ఫిర్యాదు అందడంతో అధికారులు విచారణ ప్రారంభించారు.


పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో గతంలో పనిచేస్తూ సస్పెండ్​ అయిన గృహనిర్మాణ శాఖ ఏఈ నాగరాజుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై మంగళవారం ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఇంటి బిల్లులు విడుదల చేసేందుకు నాగరాజు రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశారని మొగల్తూరుకు చెందిన వీరాంజనేయులు స్పందనలో ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏలూరు ఇన్​స్పెక్టర్​ రవీంద్ర సిబ్బందితో కలిపి మొగల్తూరు​లో గృహ నిర్మాణ శాఖ కార్యాలయానికి వచ్చి బాధితులను విచారించి వివరాలు నమోదు చేశారు. ఈ విచారణలో ఏసీబీ ఎస్ఐ శ్రీనివాసరాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

యానాంలో వంద శాతం ఓటింగ్​ కోసం​ వినూత్న ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.