ETV Bharat / state

వ్యక్తి దారుణ హత్య.. ముగ్గురి అరెస్టు

author img

By

Published : Dec 4, 2019, 10:51 AM IST

వ్యక్తి దారుణ హత్య.. ముగ్గురి అరెస్టు
వ్యక్తి దారుణ హత్య.. ముగ్గురి అరెస్టు

పశ్చిమ గోదావరి జిల్లా పెద్దేవంలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో కొట్టి దారుణంగా హతమార్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

వ్యక్తిని దారుణంగా హతమార్చిన దుండగులు

పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవంలో దుర్గారావు అనే వ్యక్తిని దుండగులు దారుణంగా హతమార్చారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కర్రలతో తీవ్రంగా కొట్టి చంపేసి.. మృత దేహాన్ని దూరంగా పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం తాగే సమయంలో గొడవ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. హత్యకు సంబంధించి ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి:

తల్లీబిడ్డను పెట్రోలు పోసి... తగలబెట్టారు..!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.