ETV Bharat / state

మనస్తాపంతో పురుగులమందు తాగి రైతు ఆత్మహత్య

author img

By

Published : Sep 18, 2020, 9:00 AM IST

Former suicide with financial problems in annamnaiduvalasa vizianagaram district
మనస్తాపంతో పురుగులమందు తాగి రైతు ఆత్మహత్య

వర్షాభావ పరిస్థితుల్లో పంట ఎండిపోవటంతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరం జిల్లా అన్నంనాయుడువలసలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం అన్నంనాయుడువలసకు చెందిన సూర్య నారాయణ.. అయిదు ఎకరాలలో వరి పంట సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితులతో పంట ఎండిపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి : ఉండిలో అవినీతి పెరిగిపోయింది... వైకాపా నేత తిరుగుబాటు దీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.