'అది ఎన్నికలకు ఎర వేసే సదస్సు.. పాత ప్రాజెక్టులకే కొత్త ఎంఓయూలు'

author img

By

Published : Mar 5, 2023, 1:09 PM IST

మాజీ మంత్రి పితాని

Pitani Satyanarayana : విశాఖలో జరిగిన పెట్టబడిదారుల సదస్సును తాము ఎన్నికల స్టంట్ గా పరిగణిస్తున్నామని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు దక్కాలని తాము కోరుతున్నామని, కానీ, జగన్ ప్రభుత్వం ప్రజలను, యువతను మభ్యపెడుతోందని ఆయన ఆరోపించారు.

Pitani Satyanarayana : అందరూ జగన్మోహన్ రెడ్డి చట్టంలోనే పని చేయాలి.. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతారని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. విశాఖ పెట్టుబడిదారుల సదస్సును ఎన్నికల స్టంట్​గా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క అధికారికి స్వేచ్ఛగా పనిచేసే అధికారం లేదని తెలిపారు. అందరూ సీఎం జగన్ మోహన్ రెడ్డి చట్టానికి లోబడి పని చేయవలసిన దుస్థితి నెలకొందని విమర్శించారు. మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ తో కలిసి రాజాం మండలం శ్యాంపురంలో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏ ఒక్కరు మాట్లాడినా కేసులు పెడతారని ఆరోపించారు. టీడీపీ శ్రేణులు అంతా సమష్టిగా పనిచేసి ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవిరావును గెలిపించాలని కోరారు.

అంతా అంకెల గారడీ తప్ప ఏమీ లేదు.. విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అంతా అంకెల గారడీ.. అబద్ధాలు తప్ప ఏమీ లేదని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆరోపించారు. లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్.. యువతను మోసం చేస్తున్నారని పితాని తెలిపారు. నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నిద్రపోయారా..? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయం వచ్చేసింది... గ్లోబల్ సమ్మిట్ అంతా సార్వత్రిక ఎన్నికల స్టంట్​గానే భావిస్తున్నామని చెప్పారు. ఏ కంపెనీ ఎంత పెట్టుబడి పెట్టిందో ప్రకటించాలని, టైం బాండ్ గురించి వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో పరిశ్రమలు రావాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కాలని టీడీపీ కోరుతుందని తెలిపారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాటం చేస్తుంటే వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు డ్రామాలు ఆడటం తప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించలేదని మండిపడ్డారు. విశాఖను రాజధాని చేస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మాజీ మంత్రి పితాని ఎద్దేవా చేశారు.

మాజీ మంత్రి పితాని సత్యనారాయణ

అధికారులు పోలీసులు ఎవరైన్ సరే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నడుచుకోవాల్సిందే. ఆయన ఎవరిపై కేసులు పెట్టాలో చెప్తే చాలు... పోలీసులు అందుకు అనుగుణంగా నడుచుకుంటారు. ఎలాంటి కారణం కూడా అవసరం లేకుండా పోలీసులు కేసులు పెడుతున్నారు. రాత్రికి రాత్రి సీఎంఓ నుంచి ఆదేశాలు జారీ చేస్తారు. అధికారులు కూడా జీఓలకు అనుగుణంగా కాకుండా అధికార పార్టీ నాయకులు ఎలా చెప్తే అలా పని చేయాల్సిందే. ఇటీవల గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీ కి చెందిన ఓ కార్యకర్త అధికార పార్టీని విమర్శించారని అతడిపై గంజాయి కేసు పెట్టారు. ఇంత దుర్మార్గమైన పరిస్థితి దేశంలో, రాష్ట్రంలో మరెక్కడా లేదు. ఎక్కడా రాకూడదు. - పితాని సత్యనారాయణ, మాజీ మంత్రి

పాత ప్రాజెక్టులకేే.. కొత్త ఎంఓయూలు.. ఆంధ్రాకు కేవలం సోలార్ పెట్టుబడులు మాత్రమే వస్తాయా అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ కుమార్ ధ్వజమెత్తారు. గత జూన్​లో దావోస్​కు వెళ్లారు.. సోలార్ ప్రాజెక్టులు తెచ్చామన్నారని మండిపడ్డారు. సెప్టెంబర్​లో ఆంధ్రా ప్రాంత కంపెనీలకు సోలార్ ప్రాజెక్టులు పందేరం చేశారని ఆక్షేపించారు. వైజాగ్ సమ్మిట్​లో మళ్ళీ సోలార్ ప్రాజెక్టులే 8.3 లక్షల కోట్లు అంటున్నారు, ఒక్క సోలార్ ప్రాజెక్టు ప్రారంభం కాలేదు గానీ, భూపందేరం కూడా మొదలైన ప్రాజెక్టులకు మళ్లీ వైజాగ్ సమ్మిట్​లో కొత్త ఎంఓయూలా అని ప్రశ్నించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.