ETV Bharat / state

మున్సిపల్​ ఎన్నికలు: తెదేపా గూటికి వైకాపా కార్యకర్తలు

author img

By

Published : Feb 28, 2021, 5:43 PM IST

ycp activist join in tdp
మున్సిపల్​ ఎన్నికల వేళ.. తెదేపా గూటికి వైకాపా కార్యకర్తలు

మున్సిపాలిటీ ఎన్నికలకు ముందు చేరికలు ఊపందుకున్నాయి. విశాఖ జిల్లాలో పలువురు వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరారు.

విశాఖ జిల్లా నర్సీపట్నంలో పుర పోరుకు ముందు వలసలు ఊపందుకున్నాయి. పట్టణంలోని రెండో వార్డులో 50 మంది వైకాపా కార్యకర్తలు తెలుగు యువత అధ్యక్షుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. పార్టీ కండువా కప్పి తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ వారిని ఆహ్వానించారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పీఠంపై తెదేపా జెండా ఎగరవేయడానికి కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: విశాఖలో పార్టీ నేతలతో అచ్చెన్నాయుడు సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.