ETV Bharat / state

నర్సీపట్నం మున్సిపాలిటీ పీఠంపై తర్జన భర్జన

author img

By

Published : Mar 16, 2021, 6:25 PM IST

narsipatnam municipality
నర్సీపట్నం మున్సిపాలిటీ పీఠం తర్జన భర్జన

విశాఖలోని నర్సీపట్నం మున్సిపల్ ఛైర్మన్​ ఎన్నిక అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఛైర్మన్​తో పాటు వైస్​ ఛైర్మన్​ పదవి కోసం పార్టీలో గట్టి పోటీ నెలకొంది. వీరి ఎంపిక విషయంలో స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ తర్జనభర్జన పడుతున్నారు.

విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పీఠం చర్చనీయాంశంగా మారింది. ఈ మున్సిపాలిటీ ఛైర్మన్ పదవిని ఎస్సీ మహిళకు కేటాయించిన విషయం తెలిసిందే.

వైకాపా తరఫున బలిఘట్టం నుంచి గెలుపొందిన గుదిబండ ఆదిలక్ష్మి, పెద్దబొడ్డేపల్లి నుంచి గెలుపొందిన బోడపాటి సుబ్బలక్ష్మి పేర్లతో పాటు స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి వైకాపా తీర్థం పుచ్చుకున్న చక్క బాలమ్మ పేరు కూడా ప్రధానంగా ఛైర్మన్ పీఠం కోసం వినిపిస్తున్నాయి. ఇందుకోసం పార్టీ నాయకులతోనూ, గెలుపొందిన కౌన్సిలర్లతోనూ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎప్పటికప్పుడు సమాలోచనలు చేస్తున్నారు. మరోవైపు వైస్ ఛైర్మన్ ఎంపిక అత్యంత కీలకంగా మారింది. ఇందుకోసం ఐదు వార్డు నుంచి గెలుపొందిన గొలుసు నరసింహమూర్తితో పాటు 8వ వార్డు నుంచి విజయం సాధించిన కోనేటి రామకృష్ణ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

ఛైర్మన్ , వైస్ ఛైర్మన్ పదవులు కీలకం కావడంతో ఎమ్మెల్యే గణేష్ తర్జనభర్జన పడుతున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార పార్టీ 14 వార్డులను, తెదేపా 12 వార్డులను, జనసేన ఒకటి, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డును సొంతం చేసుకున్నారు.

ఇదీ చదవండి

మావోయిస్టు ప్రభావిత గ్రామాలకు ఉచిత బస్సు సర్వీసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.