ETV Bharat / state

అకారణంగా కమిషనర్​ దూషించారంటూ కార్మికుల నిరసన

author img

By

Published : Mar 20, 2021, 6:47 PM IST

municipal employees agitation
అకారణంగా కమిషనర్​ దూషించారంటూ కార్మికుల నిరసన

విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుడిని కమిషనర్ దూషించారని ఆరోపిస్తూ.. కార్మికులు ఆందోళనకు దిగారు. మున్సిపల్​ కమిషనర్ కనకారావు తీరుపై నిరసన వ్యక్తం చేశారు. బాధితుడికి క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న బుర్ర శ్రీనివాస రావు అనే వ్యక్తిని కమిషనర్ కనకారావు అకారణంగా దూషించారని కార్మికులు ఆరోపించారు. ఈ ఘటనకు నిరసనగా మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

తదుపరి కార్యాచరణపై నిర్ణయించుకునేందుకు స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియం వద్ద సీఐటీయూ నాయకులు సత్తిబాబు సారధ్యంలో సమావేశమయ్యారు. స్వీపర్ శ్రీనివాసరావుకు కమిషనర్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్​ చేశారు. అంతవరకూ తాము విధుల్లోకి రాబోమన్నారు.

ఇదీ చదవండి:

'కలిసికట్టుగా పోరాడుదాం.. ఆత్మహత్య నిర్ణయాన్ని వెనక్కి తీసుకో'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.