ETV Bharat / state

gold seized: రైలు బండిలో ఒక్కడే దొంగ.. చేతిలో రూ.రెండు కోట్ల సరుకు!

author img

By

Published : Nov 4, 2021, 6:11 PM IST

gold seized
gold seized

రైల్లో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి దాదాపు 2 కోట్లు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం (gold seized) చేసుకున్నారు.

రైల్లో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని డైరెక్టరేట్ ఆఫ్ రివెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో యశ్వంత్‌పుర్‌- హౌరా ఎక్స్‌ప్రెస్‌(Yeshwantpur- Howrah Express)లో బంగారాన్ని తరలిస్తున్నాడన్న సమాచారం మేరకు.. విశాఖ రైల్వే స్టేషన్​లో బుధవారం మధ్యాహ్నం అధికారులు మాటువేశారు.

రైలు రాగానే.. అందులోకి ప్రవేశించి.. నిందితుడిని తనిఖీ చేశారు. అతని వద్ద ఏకంగా.. రూ.1.91 కోట్లు విలువ చేసే 3.89 కిలోల బంగారం బయటపడింది. నిందితుడు కోల్‌కతా నుంచి ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పట్టుబడిన బంగారాన్ని బంగ్లాదేశ్ నుంచి తీసుకువచ్చి.. కోల్​కతాలో వివిధ రకాల ఆభరణాలుగా తయారు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని అధికారులు చెప్పారు. నిందితుడిని జ్యూడిషియల్ కస్టడీకి తరలించినట్లు డిఆర్ఐ(DRI) అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి

Gold Fraud: దుబాయ్ గోల్డ్ తక్కువ ధరకే.. ఫేస్​బుక్​లో ప్రకటన.. ఆ తర్వాత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.