విశాఖ జిల్లా అనకాపల్లి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో హెడ్ క్లర్కుగా కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్న శివ కృష్ణ మోహన్ అనే వ్యక్తి లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. బీ మురళీకృష్ణ అనే వ్యక్తి సివిల్ కేసుకు సంబంధించి ఒరిజినల్ సూట్ (ఓఎస్) నెంబరు చెప్పడానికి రూ. 10వేలు లంచం డిమాండ్ చేశారు.
మురళీ కృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఇవాళ రూ. 5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డట్లు ఏసీబీ డీఎస్పీ రంగరాజు తెలిపారు. శివ కృష్ణ మోహన్ గత ఏడాది అనకాపల్లి కోర్డులో పదవీ విరమణ పొందారు. తిరిగి ఇదే కోర్టులో కాంట్రాక్టు ఉద్యోగిగా చేరారు. అక్రమాలకు పాల్పడి అనిశాకు చిక్కారు.
ఇవీ చూడండి:
'రాసిపెట్టుకోండి.. దొంగ లెక్కలు తేలుస్తాం.. ప్రతీ రూపాయి కక్కిస్తాం