ETV Bharat / state

స్వార్థం కోసం ఇచ్చే ప్రభుత్వ పథకాలపై ఆధారపడొద్దు: బ్రదర్​ అనిల్​

author img

By

Published : Dec 16, 2022, 2:45 PM IST

Updated : Dec 16, 2022, 5:47 PM IST

Brother Anil Comments : రాష్ట్ర ప్రభుత్వంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు ఫాస్టర్​ బ్రదర్​ అనిల్​ కుమార్​. ప్రభుత్వం స్వార్థం కోసం ఇచ్చే పథకాలపై ప్రజలు ఆధారపడోద్దని ఆయన వ్యాఖ్యనించారు.

Brother Anil
ఫాస్టర్​ బ్రదర్​ అనిల్​ కుమార్​

Brother Anil Comments : తమ స్వార్థం కోసం ప్రభుత్వాలు పథకాలను అందిస్తున్నాయని.. వాటిపై ప్రజలేవరు అధారపడొద్దని బ్రదర్​ అనిల్​ కుమార్ అన్నారు. విశాఖ జిల్లా భీమిలి మండలంలోని క్రైస్ట్ కేర్​ అండ్​ మినిస్ట్రీస్ క్రిస్మస్​ సందర్భంగా నిర్వహించిన ప్రార్థన కూడికలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు దేవుడి పథకాలు వేరేగా ఉంటాయని వ్యాఖ్యానించారు.

ఫాస్టర్​ బ్రదర్​ అనిల్​ కుమార్​
ఫాస్టర్​ బ్రదర్​ అనిల్​ కుమార్​

రాష్ట్ర ప్రజలకు ఏపీలో కాకుండా పక్క రాష్ట్రంలో పుట్టిన బాగుండుననే భావన ఏర్పడిందన్నారు. బ్రదర్ అనీల్ తన ప్రసంగంలో ప్రత్యేకంగా ఎవరి పేరును ప్రస్తావించలేదు. కేవలం ప్రభుత్వం, ప్రభుత్వాలు అంటూ తన దైవ వాక్యం మధ్యలో పలుకుతూ పలు వ్యాఖ్యలు చేశారు. బ్రదర్​ అనిల్ గతంలో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు​ ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Dec 16, 2022, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.